మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
కరాటే పోటీలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. ఇటీవల గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలలో బీరంగూడకు చెందిన క్రేజీ క్రూ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో చిన్నారులను జిఎంఆర్ అభినందించారు. విద్యార్థి స్థాయి నుండి క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మల్లేష్, శివా రెడ్డి, వెంకటేష్, మేరాజ్ ఖాన్, రామచందర్, రామకృష్ణ, అకాడమీ నిర్వాహకులు సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ జ్యూవెలరీ సంస్థలు వినియోగదారుల కోసం ఒకే వేదికపై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నట్లు సిఐటియు…
బిస్లరి పరిశ్రమ కార్మికులు చెట్ల కొమ్మలు కట్టుకొని వినూత్నం నిరసన అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి ఈనెల 25న…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన యాదవ…
మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు బ్యాగుల పంపిణీ శేరిలింగంపల్లి మనవార్తలు ప్రతినిధి :…