Telangana

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ గా సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ మాజీద్ అలీ

-రాష్ట్రస్థాయి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అవగాహన సదస్సు రవీంద్ర భారతిలో నిర్వాహణ

-ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మీడియా ఎన్జీవోల పాత్ర కీలకం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) సామాన్యుడికి కొండంత ధైర్యమని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ మాజీద్ అలీ అన్నారు. హైదరాబాదులోని రవీంద్ర భారతి లో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్,రాష్ట్ర అధ్యక్షులు సూర్య స్రవంతి చేతుల మీదుగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నియామక పత్రాన్ని అందించారు. అనంతరం మాజీద్ అలీ మాట్లాడుతూ  పారదర్శకమైన పాలనకు ఆర్టిఐ ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ పాలనలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదని తెలిపారు. సమాచార హక్కు చట్టం మాత్రమే కాదు- పాలనలో పౌరులు భాగస్వామ్యం కావడం అని అభిప్రాయపడ్డారు. ఈ చట్టాన్ని వ్యక్తిగత అవసరాలకు కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని అన్నారు.2005లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందని,దీనితో పాలనలో పారదర్శకత పెరిగిందని చెప్పారు. జవాబుదారీతనం పారదర్శకంగా పనిచేసేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరే సమాచారాన్ని అందించడంలో పీఐవో, ఏపీఐవో ల బాధ్యత కలిగి ఉండాలన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరిన సమాచారం అందించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం 2005 లోని అంశాలు, ఆర్టిఐ దరఖాస్తు విధానం, దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తు ఫీజు, ఇవ్వాల్సిన సమాచారం, పీఐవో, ఏపీఐవో ల బాధ్యతలు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర్య స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్ గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ కొంగటి రాజ్ కుమార్, సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

12 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago