Telangana

గీతంలో పీహెచ్.డీ. ప్రవేశాలు

ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, హ్యుమానిటీస్, లాలో ఫుల్-టైమ్ కోర్సులు

పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తల కోసం ఎక్స్ ట్రామ్యూరల్ పీహెచ్.డీ. ప్రోగ్రామ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నంలో నెలకొని ఉన్న మూడు ప్రాంగణా లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీహెచ్.డీ. ప్రోగ్రామ్ లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోందని పరిశోధన, అభివృద్ధి డైరెక్టర్ ప్రొఫెసర్ రామగోపాల్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్ మెంట్, ఫార్మసీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, న్యాయశాస్త్రం (లా) వంటి విభిన్న విభాగాలలో ఫుల్-టైమ్ అభ్యర్థులకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తల కోసం రూపొందించిన ఎక్స్ ట్రామ్యూరల్ పీహెచ్.డీ. ప్రోగ్రామ్ – ఇంజనీరింగ్, సైన్స్, ఫార్మసీ విభాగాలలో అందుబాటులో ఉందని ఆయన తెలియజేశారు.సంబంధిత మాస్టర్స్ డిగ్రీ (కనీసం 55 శాతం మార్కులు), కనీసం 75 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ, లేదా ఎం.ఫిల్. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులని ప్రొఫెసర్ రామగోపాల్ పేర్కొన్నారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న చివరి ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.గీతం రీసెర్చ్ అడ్మిషన్స్ టెస్ట్ (GReAT), దాని తరువాత జరిగే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. UGC-NET, CSIR-NET, GATE, GPAT, ICAR, or DBT-JRF వంటి చెల్లుబాటయ్యే జాతీయ స్థాయి పరీక్ష స్కోర్లు ఉన్న అభ్యర్థులకు రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుందని, వారిని నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తామని ఆయన వివరించారు.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 11, 2026 అని ప్రొఫెసర్ రామగోపాల్ స్పష్టీకరించారు. ప్రవేశ పరీక్షలు మే 23న (ఆన్ లైన్ లో), మే 30న (ప్రత్యక్షంగా) జరుగుతాయని, ప్రోగ్రామ్ ఆగస్టు 24, 2026న ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.అర్హత కలిగిన ఫుల్-టైమ్ పీహెచ్.డీ. పరిశోధకులకు మూడు సంవత్సరాల వరకు నెలకు రూ.33 వేల ఫెలోషిప్ తో పాటు, అధునాతన పరిశోధనా సౌకర్యాలు, సహకారాలు, అకడమిక్ మద్దతును గీతం అందిస్తుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గీతం అధికారిక పోర్టల్ https://researchadmissions.gitam.edu లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. ఇతర వివరాల కోసం 0891-2866411 ను సంప్రదించాలని, లేదా phdsupport@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

58 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago