మనవార్తలు ,హైదరాబాద్:
హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. తర్వాతి కాలంలో వాడవాడలా గణేశుని లడ్డూలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అయితే సినీ సెలబ్రిటీలందరూ మొక్కే ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపంలో ఉన్న లడ్డుని ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ లడ్డుని ఫిలింనగర్ దైవ సన్నిధానం పాలకమండలి సభ్యులు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కాజా సూర్యనారాయణ, దగ్గుబాటి లక్ష్మీ( దగ్గుబాటి సురేష్ బాబు సతీమణి) సమక్షంలో సురేష్ కొండేటికీ అందజేశారు.. ఇక ఈ సందర్భంగా వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సురేష్ కొండేటి వెల్లడించారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…