మనవార్తలు ,హైదరాబాద్:
హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. తర్వాతి కాలంలో వాడవాడలా గణేశుని లడ్డూలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అయితే సినీ సెలబ్రిటీలందరూ మొక్కే ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపంలో ఉన్న లడ్డుని ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ లడ్డుని ఫిలింనగర్ దైవ సన్నిధానం పాలకమండలి సభ్యులు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కాజా సూర్యనారాయణ, దగ్గుబాటి లక్ష్మీ( దగ్గుబాటి సురేష్ బాబు సతీమణి) సమక్షంలో సురేష్ కొండేటికీ అందజేశారు.. ఇక ఈ సందర్భంగా వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సురేష్ కొండేటి వెల్లడించారు.
ఎస్ఐఆర్లో పాల్గొనండి.. పటాన్చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…
బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…