– ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు స్వచ్ఛందంగా ఉచిత బోధన
-ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ జిల్లా జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు డి జగన్మోహన్ రావు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నవ సమాజ నిర్దేశకులైన( ప్రైవేటు పాఠశాలలు) ఉపాధ్యాయులకు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఐదు లక్షల ప్రమాద బీమా అందజేయబోతున్నట్లు చెప్పడం ఆయన ఉదార స్వభావానికి నిదర్శనమని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు డి జగన్మోహన్ రావులు పేర్కొన్నారు. పటాన్ చెరు పట్టణ శివారులో గల జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పటాన్ చెరు నియోజకవర్గ ప్రైవేటు పాఠశాలల గురుపూజోత్సవంలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవంతో మాదిరిగానే ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో గురుపూజోత్సవంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. బావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయలు, ఉపాధ్యాయినీలకు తన సొంత నిధులతో ప్రమాద బీమా అందజేస్తున్నట్లు ప్రకటించడం ఆయన మంచితనానికి నిదర్శనమన్నారు. ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలను ఎక్కడ ఉల్లంఘించకుండా రేపటి భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులను అక్కున చేర్చుకోవడంతోపాటు స్వచ్ఛందంగా పేద విద్యార్థులకు ఉచిత బోధన అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర సలహాదారులు యాదగిరి శేఖర్ రావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…