Telangana

నవ సమాజ నిర్దేశకులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఐదు లక్షల బీమా ఇవ్వటం పట్ల హర్షం

– ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు స్వచ్ఛందంగా ఉచిత బోధన

-ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ జిల్లా జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు డి జగన్మోహన్ రావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నవ సమాజ నిర్దేశకులైన( ప్రైవేటు పాఠశాలలు) ఉపాధ్యాయులకు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఐదు లక్షల ప్రమాద బీమా అందజేయబోతున్నట్లు చెప్పడం ఆయన ఉదార స్వభావానికి నిదర్శనమని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు డి జగన్మోహన్ రావులు పేర్కొన్నారు. పటాన్ చెరు పట్టణ శివారులో గల జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పటాన్ చెరు నియోజకవర్గ ప్రైవేటు పాఠశాలల గురుపూజోత్సవంలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవంతో మాదిరిగానే ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో గురుపూజోత్సవంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. బావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయలు, ఉపాధ్యాయినీలకు తన సొంత నిధులతో ప్రమాద బీమా అందజేస్తున్నట్లు ప్రకటించడం ఆయన మంచితనానికి నిదర్శనమన్నారు. ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలను ఎక్కడ ఉల్లంఘించకుండా రేపటి భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులను అక్కున చేర్చుకోవడంతోపాటు స్వచ్ఛందంగా పేద విద్యార్థులకు ఉచిత బోధన అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర సలహాదారులు యాదగిరి శేఖర్ రావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago