Telangana

పదో తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ

– విద్యా హై స్కూల్ లో పూసిన కుసుమాలు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రాథమిక దశలోనే విద్యా ప్రతిష్టంగా ప్రతిష్ఠంగా ఉండాలి. అలాంటి సిద్ధాంతాన్ని నమ్మిన స్కూల్ డైరెక్టర్ త్రిమూర్తులు పొన్నాడ సారధ్యంలో విద్యార్థులు దూసుకుపోతున్నారు. ఈ సారి వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గణనీయమైన మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించి స్కూల్ కు ఉన్న విద్యా అనే పేరును నిలబెట్టారు. అంకుటిoత దీక్షా, పట్టుదల, కష్టపడే మనస్తత్వం ఉన్న అధ్యాపక బృందం, సాధించాలనే పట్టుదల గల విద్యార్థులు ఉండడం వల్లే ఈ ఫలితాలు రావడానికి కారణమయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈసారి మంచి ఫలితాలు సాధించిన నీతు చౌదరి 576, రoషా ఖాన్ – 555, పి. స్రవంతి – 544, రహీమా భాను – 539, సందీప్ – 527, ఫయీజ్ హుస్సేన్ – 510, జె. గీతిక – 503, సబిత – 501 విద్యార్థులతో పాటు విజయం సాధించిన విద్యార్థులoదరిని త్రిమూర్తులు అభినందించారు.

కార్పొరేట్ సంస్థల కు ధీటుగా ఫలితాలు – త్రిమూర్తులు పొన్నాడ

పెరుగుతున్న పోటీ ప్రపంచాన్ని తట్టుకొని కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా తమ స్కూల్ విద్యార్థులు విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికనుగుణగా విద్యా బోధన చేస్తున్న తమ బృందానికి ఎప్పటికప్పుడు సరైన సూచనలిస్తూ అన్నిరంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

58 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago