– నాటు నాటు రుచులతో గచ్చిబౌలిలో ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’
– పాల్గొన్న పలు సినీ, రాజకీయ ప్రముఖులు*
మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
నగరంలోని గచ్చిబౌలిలో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ‘ఎల్లిపాయకారం’ నూతన అవుట్లెట్ ను ఎంపీ ఈటల రాజేందర్, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ లు ఘనంగా ప్రారంభించారు. గచ్చిబౌలిలోని ఎల్లో సఫైర్ హోటల్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ సెలెబ్రేటీలు హాజరై సందడి చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్, ఆరెకపూడి గాంధీ, నటి కె సుధ, నటులు మధు దామరాజు, మహేష్ ఆచంట, షఫీ, దర్శకుడు కార్తీక్ దండు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రుచులను ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సాంప్రదాయ ఆరోగ్యకరమైన ఎల్లిపాయ కారంను నగర ప్రజలకు అందించడం అభినందనీయం. ఎల్లిపాయ కారం మరో బ్రాంచి గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు. తెలిపారు.
ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఎల్లిపాయకారం ఐటీ ప్రాంతంలో నాటు రుచులను అందించడం అభినందనీయం. ఆరోగ్య పరంగా ఎల్లిపాయకారం ఎంత మంచిదో ఈ రెస్టారెంట్ అలాంటి ఆహారం అందించాలన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఎల్లో శాఫిరే హోటల్ నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు. తెలిపారు. నూతనంగా ప్రారంభమైన ఈ ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్ ‘ అవుట్లెట్లో సంప్రదాయ రుచులతో పాటు ఆధునిక శైలిలో తయారు చేసే వివిధ రకాల ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఫౌండర్ గంగా విరజ్ కోట, కో-ఫౌండర్ సాయిశ్రీ తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకమైన నాటురుచులను ఫాస్ట్ ఫుడ్ తరహాలో ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎల్లిపాయకారం – గచ్చిబౌలి అవుట్లెట్ను సిద్ది వినాయక ఫుడ్ ఆండ్ బేవరేజ్ కంపెనీ నుంచి ప్రారంభించినట్టు చెప్పారు. ఎల్లిపాయకారం చికెన్ వేపుడు, ప్రవున్స్ ఘీ రోస్ట్, బిర్యానీ.. వంటి ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరిశుభ్రత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
అన్ని రకాల ఈవెంట్స్కి క్యాటరింగ్ సర్వీస్ కూడా అందిస్తామని తెలిపారు.’ఎల్లిపాయకారం’ బ్రాండ్ భవిష్యత్తులో మరిన్ని శాఖలను ప్రారంభించి యువతతో పాటు కుటుంబాలకూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని అతిథులు వ్యక్తం చేశారు. సెలబ్రిటీల సందడి, స్థానికుల ఉత్సాహంతో గచ్చిబౌలిలో జరిగిన ఈ ప్రారంభోత్సవం పండుగ వాతావరణాన్ని తలపించింది. కొత్త అవుట్లెట్ ప్రారంభంతో ఆ ప్రాంతంలోని ఫుడ్ లవర్స్కు మరో రుచికరమైన ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లైందనీ నిర్వాహకులు తెలిపారు.
–
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…