Telangana

ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా ఎల్లిపాయకారం రెస్టారెంట్’ ప్రారంభం

– నాటు నాటు రుచులతో గచ్చిబౌలిలో ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్’

– పాల్గొన్న పలు సినీ, రాజకీయ ప్రముఖులు*

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

నగరంలోని గచ్చిబౌలిలో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ‘ఎల్లిపాయకారం’ నూతన అవుట్‌లెట్ ను ఎంపీ ఈటల రాజేందర్, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ లు ఘనంగా ప్రారంభించారు. గచ్చిబౌలిలోని ఎల్లో సఫైర్ హోటల్స్ వ‌ద్ద జ‌రిగిన‌ ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ సెలెబ్రేటీలు హాజరై సందడి చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్, ఆరెకపూడి గాంధీ, న‌టి కె సుధ, న‌టులు మధు దామరాజు, మహేష్ ఆచంట, షఫీ, ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని రుచుల‌ను ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సాంప్రదాయ ఆరోగ్యకరమైన ఎల్లిపాయ కారంను నగర ప్రజలకు అందించడం అభినందనీయం. ఎల్లిపాయ కారం మరో బ్రాంచి గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు. తెలిపారు.

ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఎల్లిపాయకారం ఐటీ ప్రాంతంలో నాటు రుచులను అందించడం అభినందనీయం. ఆరోగ్య పరంగా ఎల్లిపాయకారం ఎంత మంచిదో ఈ రెస్టారెంట్ అలాంటి ఆహారం అందించాలన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఎల్లో శాఫిరే హోటల్ నిర్వాహకులకు అభినందనలు, శుభాకాంక్షలు. తెలిపారు. నూతనంగా ప్రారంభమైన ఈ ‘ఎల్లిపాయకారం రెస్టారెంట్ ‘ అవుట్‌లెట్‌లో సంప్రదాయ రుచులతో పాటు ఆధునిక శైలిలో తయారు చేసే వివిధ రకాల ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఫౌండ‌ర్ గంగా విరజ్ కోట, కో-ఫౌండ‌ర్ సాయిశ్రీ తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకమైన నాటురుచులను ఫాస్ట్ ఫుడ్ తరహాలో ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎల్లిపాయకారం – గచ్చిబౌలి అవుట్‌లెట్‌ను సిద్ది వినాయక ఫుడ్ ఆండ్ బేవరేజ్ కంపెనీ నుంచి ప్రారంభించినట్టు చెప్పారు. ఎల్లిపాయకారం చికెన్ వేపుడు, ప్రవున్స్ ఘీ రోస్ట్, బిర్యానీ.. వంటి ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరిశుభ్రత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నిర్వాహకులు స్పష్టం చేశారు.

అన్ని రకాల ఈవెంట్స్‌కి క్యాట‌రింగ్ సర్వీస్ కూడా అందిస్తామని తెలిపారు.’ఎల్లిపాయకారం’ బ్రాండ్ భవిష్యత్తులో మరిన్ని శాఖలను ప్రారంభించి యువతతో పాటు కుటుంబాలకూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని అతిథులు వ్యక్తం చేశారు. సెలబ్రిటీల సందడి, స్థానికుల ఉత్సాహంతో గచ్చిబౌలిలో జరిగిన ఈ ప్రారంభోత్సవం పండుగ వాతావరణాన్ని తలపించింది. కొత్త అవుట్‌లెట్ ప్రారంభంతో ఆ ప్రాంతంలోని ఫుడ్ లవర్స్‌కు మరో రుచికరమైన ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లైందనీ నిర్వాహకులు తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago