Telangana

సమిష్టి సహకారంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రతి వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..

ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి

పూర్తి పారదర్శకతతో నిధుల కేటాయింపు

ప్రశాంతంగా ముగిసిన కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

బిఆర్ఎస్ ఖాతాలో నాలుగు కో ఆప్షన్ పదవులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడంతోపాటు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాలకవర్గానికి సూచించారు. శనివారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమానికి హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిఆర్ఎస్ తరపున ప్రతిపాదించిన విష్ణువర్ధన్ రెడ్డి, బండ సోనియా, నిజాముద్దీన్ బాబా, ఆసియా బేగంలు పూర్తి మెజారిటీతో కో ఆప్షన్ సభ్యులుగా ఎంపికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్ తమ వార్డు పరిధిలో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిబద్దతతో పని చేయాలని కోరారు.

ఇప్పటికే 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని అతి త్వరలో వీటికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. అధికార, ప్రతిపక్షం అని తేడా లేకుండా ప్రతి వార్డుకి సమస్థాయిలో నిధుల కేటాయింపులు చేయాలని పాలకవర్గానికి సూచించారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందిస్తూ పారదర్శక పరిపాలన అందించాలని సూచించారు.

నూతన కోఆప్షన్ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుమలత, కమిషనర్ వెంకట కిషన్, సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లు మమత, వెంకటేష్. ఆంజనేయులు. రాహుల్ రెడ్డి, ఈశ్వరమ్మ, కిషోర్ రెడ్డి, మంజుల, సంధ్య, నరేందర్ రెడ్డి, పాండు, లత, రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ఖాజిపల్లి జిఎంఆర్ కాలనీలో ప్రజలకు సకల సౌకర్యాలు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం : గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజిపల్లి జిఎంఆర్ కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు…

4 hours ago

గీతంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రారంభం: వెల్లడించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం…

4 hours ago

జిన్నారం శివాలయం అభివృద్ధికి 36 లక్షల రూపాయలు అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

శివాలయం మండప నిర్మాణానికి శంకుస్థాపన గతంలో దేవాలయం అభివృద్ధికి 16 లక్షల రూపాయల సొంత నిధుల విరాళం మనవార్తలు ప్రతినిధి…

7 hours ago

ఓటు చోరీపై అప్రమత్తంగా ఉండాలి: నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, సంగారెడ్డిలో కాంగ్రెస్ బీఎల్ఎలకు సర్ పై అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్…

20 hours ago

అతి త్వరలో ముత్తంగిలో అంబేద్కర్ భవన నిర్మాణం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: త్వరలో ముత్తంగి గ్రామంలో అంబేద్కర్ భవనాన్ని నిర్మించబోతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్…

20 hours ago

గీతంలో ప్రాజెక్టు అసోసియేట్ అవకాశం

పరిశోధనా ప్రాజెక్టు కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ప్రధాన పరిశోధకురాలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

20 hours ago