Telangana

సమిష్టి సహకారంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రతి వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..

ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి

పూర్తి పారదర్శకతతో నిధుల కేటాయింపు

ప్రశాంతంగా ముగిసిన కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

బిఆర్ఎస్ ఖాతాలో నాలుగు కో ఆప్షన్ పదవులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడంతోపాటు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాలకవర్గానికి సూచించారు. శనివారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమానికి హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిఆర్ఎస్ తరపున ప్రతిపాదించిన విష్ణువర్ధన్ రెడ్డి, బండ సోనియా, నిజాముద్దీన్ బాబా, ఆసియా బేగంలు పూర్తి మెజారిటీతో కో ఆప్షన్ సభ్యులుగా ఎంపికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్ తమ వార్డు పరిధిలో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిబద్దతతో పని చేయాలని కోరారు.

ఇప్పటికే 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని అతి త్వరలో వీటికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. అధికార, ప్రతిపక్షం అని తేడా లేకుండా ప్రతి వార్డుకి సమస్థాయిలో నిధుల కేటాయింపులు చేయాలని పాలకవర్గానికి సూచించారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందిస్తూ పారదర్శక పరిపాలన అందించాలని సూచించారు.

నూతన కోఆప్షన్ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుమలత, కమిషనర్ వెంకట కిషన్, సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లు మమత, వెంకటేష్. ఆంజనేయులు. రాహుల్ రెడ్డి, ఈశ్వరమ్మ, కిషోర్ రెడ్డి, మంజుల, సంధ్య, నరేందర్ రెడ్డి, పాండు, లత, రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

19 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

20 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

20 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

1 day ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

1 day ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

1 day ago