Telangana

సామాన్యులకు ఎల్‌ఓసి ఒక గొప్ప వరం ఎమ్మెల్సీ డా.చిన్నమైల్ అంజిరెడ్డి

ముగ్గురికి రూ. 7.20 లక్షల చెక్కులు అందజేత

మనవార్తలు ప్రతినిధి , రామచంద్ర పురం :

ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న సామాన్యులకు ఎల్‌ఓసి ఒక గొప్ప వరం అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్ర పురంకు చెందిన ముగ్గురు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రమంలో లబ్ధిదారులకు మొత్తం రూ. 7.20 లక్షల విలువైన ఎల్‌ఓసి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఓసీ పేదల పాలిట సంజీవనిలా మారిందని, అత్యవసర సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి ఖర్చులు భరించలేక అప్పుల పాలు అవుతున్న కుటుంబాలకు ఎల్ఓసీ భరోసా అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, ఎమ్మెల్సీ ఆఫీస్ లో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.

నూతన కో-ఆప్షన్ సభ్యుడికి అభినందనలు

జిన్నారం మున్సిపాలిటీ ఎన్నికైన నూతన కో-ఆప్షన్ సభ్యులు నర్సింగరావు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎమ్మెల్సీ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్సీ శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జిన్నారం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కో-ఆప్షన్ సభ్యుడిగా కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పాలకమండలితో కలిసి పని చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో ముందుండాలని సూచించారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

19 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

20 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

20 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

1 day ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

1 day ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

1 day ago