గ్రామ స్థాయి నుండి విద్యార్థి, యువత విభాగాలను పటిష్టం చేయండి
పటాన్చెరు
ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీకి విద్యార్థి, యువత విభాగాలే వెన్నెముక అని, సంస్థాగతంగా రెండు విభాగాలను పటిష్టం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి, యువత విభాగాల ముఖ్య నాయకులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
పార్టీ అధిష్టానం సూచనలకు అనుగుణంగా గ్రామస్థాయి నుండి నియోజక స్థాయి వరకు విద్యార్థి, యువత, సోషల్ మీడియా కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో రెండు విభాగాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ భవిష్యత్తు యువ నాయకులు మీరేనని, కష్ట పడిన వారికి తప్పకుండా మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో యువత విభాగం నుండి నామినేటెడ్ స్థాయి పదవి ఇచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు మేరాజ్ ఖాన్, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కృష్ణకాంత్, నియోజకవర్గ అధ్యక్షులు చెన్నారెడ్డి, ఆయా మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…