సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లోని సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు నిండు కుండల మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 11వ నెంబర్ గేటు ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు ఇరిగేషన్ అధికారులతో కలిసి విడుదల చేశారు. ముందుగా గంగా పూజ చేసి తదనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు నీటిని విడుదల చేశారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.115 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు లోకి మరో 33వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశాలున్నాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జల విద్యుత్ కేంద్రంలో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు సూచించారు. ప్రతి ఎకరాకు నీళ్ళందించదమే కేసీఆర్ కల అని ఎమ్మెల్యే క్రాంతికిరన్ అన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…