అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు …
– జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్
పటాన్ చెరు:
అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ హెచ్చరించారు.
మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో మూడవరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డీఎల్పీఓ సతీష్ రెడ్డి, ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ల తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేసి, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అపార్ట్మెంట్లలో ప్రభుత్వ అనుమతులను సరి చూసుకోని ప్రజలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. అపార్ట్మెంట్ యజమానుల మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, అనుమతి లేని నిర్మాణాలను నిర్మూలించడంలో విఫలమైనందున ఇంద్రేశం, కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీలలో ఇలాగే జరిగితే పంచాయతీ పాలకవర్గాన్ని మొత్తాన్ని సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుందని తెలిపారు. అక్రమ నిర్మాణాలను చేపడితే ఎంతటివారి పైన అయినా క్రిమినల్ కేసులు చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అదే విధంగా అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామపంచాయతీ పరిధిలో డీఎల్పీఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…