మనవార్తలు , పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ఇటీవల హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీలతో అవగాహనా ఒప్పందం ( ఎంవోయూ ) కుదుర్చుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఈ అవగాహనా ఒప్పంద పత్రాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , హెటెరో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ ఎస్.వీ.జయపాల్రెడ్డి సంతకాలు చేసినట్టు తెలియజేశారు . హెటెరో కంపెనీలోని అర్హత కలిగిన ఉద్యోగులకు డాక్టోరల్ డిగ్రీ ( పీహెచీ ) ని చదవడానికి ప్రవేశాలు కల్పించే లక్ష్యంతో ఈ అవగాహనను కుదుర్చుకున్నారు .
పీహెచ్ఐని చదవాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాను తొలుత కంపెనీ పంపుతుందని , అందులో అర్హత గల అభ్యర్థుల జాబితాను విశ్వవిద్యాలయానికి సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు . హెటెరో ఉద్యోగుల నెపుణ్యాలకు పదును పెట్టడానికి గాను యాజమాన్య వికాస కార్యక్రమా ( ఎండీపీ ) లను గీతం నిర్వహిస్తుందన్నారు . ఉభయ పక్షాలు రద్దుచేసుకునే వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపారు . ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , గీతం బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ , కెరీర్ గెడైన్స్ సెల్ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ , ఇతర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…