మనవార్తలు , పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ – హెదరాబాద్ ( జీఎస్బీ ) , అఖిల భారత సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ( ఎంఎస్ఎంఈ ) సంయుక్తంగా ఈనెల 28 న గీతం ప్రాంగణంలో ‘ క్రియేటింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్’పై ఒకరోజు సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . వ్యాపారం చేయాలనే ఆలోచన దశ నుంచి వాణిజ్యీకరణ వరకు వ్యవస్థాపక ప్రయాణం గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు . మనదేశంలోని స్టార్టప్లు , వ్యవస్థాపకులకు వివిధ సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహక పథకాలు , రాయితీలు , సహాయ వ్యవస్థలపై అంతర్దృష్టులను అందించడం ఈ సమ్మేళనం లక్ష్యమన్నారు .
యువతలో పరిశ్రమలు నెలకొల్పాలనే ఆలోచనను కల్పించడం , పరిశ్రమ స్థాపనకు అవసరమైన మెళకువలను తెలియజేయడం , ప్రతిపాదిత స్టార్టప్లకు అవసరమైన మార్గదర్శనం చేయడం ఈ సదస్సు ఉద్దేశంగా పేర్కొన్నారు . సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వివిధ సంస్థల నిపుణులు , వ్యవస్థాపక ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న ముఖ్య అధికారుల ఆలోచనలు , అనుభవాలను ఈ వేదిక నుంచి పంచుకుంటారని డెరైక్టర్ తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో బృంద చర్చలు , విజయగాథలు , సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి వంటి వాటిపై నిపుణుల మార్గదర్శనం ఉంటుందన్నారు . ఇవన్నీ పరిశ్రమ నెలకొల్పాలనే యోచన ఉన్నవారికి ఓ లోతైన అవగాహన కల్పిస్తాయని ఆయన తెలిపారు . యూజీ , పీజీ విద్యార్థులు , పరిశోధకులు , అధ్యాపకులు , వర్ధమాన పారిశ్రామికవేత్తలు ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చన్నారు . పేర్ల నమోదు , చివరి తేదీ వంటి వివరాల కోసం 98490 66459 ని సంప్రదించాలని , kkuchima@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని లేదా www.ghbs.in ను సందర్శించాలని ప్రొఫెసర్ కరుణాకర్ సూచించారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…