politics

గీతం విద్యార్థినికి 30 కి పైగా విద్యా సంస్థలలో సీట్లు…

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ , సీఎస్ఈ విద్యార్థిని మేఘన రెడ్డి కొల్లికి 2022-24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు చదవమని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న 30 కి పెగ్జా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ప్రతిపాదనలు పంపాయి . ఐఐఎం ఇండోర్ , కాశీపూర్ , అమృత్సర్ , బుద్ధగయ , సంబలూర్ , సిర్మౌర్ , జమ్మూ ; ఎండీఐ గుర్గావ్ , ఐఐటీ ధన్బాద్ – జోధ్పూర్ ; ఐఎంటీ ఘజియాబాద్ , నాగపూర్ , హెదరాబాద్ ; ఐఎంఐ ఢిల్లీ , కోల్ కతా , భువనేశ్వర్ ; ఎస్పీజేఐఎంఆర్ ముంబై నార్సిమోంజీ ముంబై మాస్టర్స్ యూనియన్ , గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చెన్నయ్ , గుర్గావ్ ; నల్సార్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ – ఢిల్లీ విశ్వవిద్యాలయాలు తమ విద్యా సంస్థలలో చేరమని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు .

విద్యలో మెరుగ్గా ఉండి తొమ్మిది సీజీపీఏ ( 90 శాతానికి పైగా మార్కులు ) సాధించడమే గాక దాదాపు పదికి పెగ్జా గీతమ్ క్లబ్లు , ప్రత్యేక ఆసక్తి సమూహాలలో భాగం కావడం ద్వారా పాఠ్యేతర కార్యకలాపాలను మేఘన సమతుల్యం చేసినట్టు తెలిపారు . గీతమ్ నిర్వహించే పలు ఉత్సవాలు , కార్యకలాపాలలో ( కళలు , వ్యాసరచన , వంట , డ్యాన్సు వంటి వాటిలో ) చురుకుగా పాల్గొనడం వంటివి తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినట్టు ఆమె పేర్కొన్నారన్నారు . గీతం నుంచి తనకు లభించిన అద్భుతమైన సహకారం వల్లనే ఇదంతా సాధ్యమైనట్టు మేఘన అభిప్రాయపడినట్టు తెలియజేశారు .

వీటికి అదనంగా , అంతర్జాతీయ సమావేశాలు , పోటీలలో మేఘన పాల్గొనడం , సహ రచయితగా నాలుగు సంకలనాలను ప్రచురించడం వంటివి జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాలపై అవగాహన పెంపొందించు కోవడానికి దోహదపడినట్టు ఆమె తెలిపిందన్నారు . నేషనల్ సెక్యూరిటీ డేటాబేస్ క్రింద సర్టిఫెడ్ సెబర్ క్రైమ్ ఇంటర్వెన్షన్ అధికారిగా తర్ఫీదు పొందడంతో పాటు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొంది , అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మూల్యాకనం చేసిన ప్రొఫెషనల్ ఎథిక్స్ లో కూడా మేఘన శిక్షణ పొందినట్టు తెలియజేశారు .

కోనిడ్ -19 లాక్డ్ డౌన్ సమయంలో చాలా ఆన్లైన్డ్ కోర్సులను చేయడంతో పాటు గీతం ద్వారా కోర్సెరా కోర్సులను కూడా ఆమె అభ్యసించినట్టు వివరించారు . ఈ నేపథ్యం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి , చివరకు భారతదేశంలోనే అత్యంత కష్టతరమైన పరీక్షలలో ఒకదాని ( క్యాట్ ) లో ఆమె విజయానికి మార్గం సుగమం చేసినట్టు పేర్కొన్నారు . తాను ఈ స్థాయికి రావడంలో తోడ్పడిన తల్లిదండ్రులు , అధ్యాపకులు , విభాగాధిపతులు , ప్రిన్సిపాళ్ళు , డెరైక్టర్లతో పాటు గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్కు మేఘన అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

12 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago