మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ , సీఎస్ఈ విద్యార్థిని మేఘన రెడ్డి కొల్లికి 2022-24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు చదవమని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న 30 కి పెగ్జా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ప్రతిపాదనలు పంపాయి . ఐఐఎం ఇండోర్ , కాశీపూర్ , అమృత్సర్ , బుద్ధగయ , సంబలూర్ , సిర్మౌర్ , జమ్మూ ; ఎండీఐ గుర్గావ్ , ఐఐటీ ధన్బాద్ – జోధ్పూర్ ; ఐఎంటీ ఘజియాబాద్ , నాగపూర్ , హెదరాబాద్ ; ఐఎంఐ ఢిల్లీ , కోల్ కతా , భువనేశ్వర్ ; ఎస్పీజేఐఎంఆర్ ముంబై నార్సిమోంజీ ముంబై మాస్టర్స్ యూనియన్ , గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చెన్నయ్ , గుర్గావ్ ; నల్సార్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ – ఢిల్లీ విశ్వవిద్యాలయాలు తమ విద్యా సంస్థలలో చేరమని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు .
విద్యలో మెరుగ్గా ఉండి తొమ్మిది సీజీపీఏ ( 90 శాతానికి పైగా మార్కులు ) సాధించడమే గాక దాదాపు పదికి పెగ్జా గీతమ్ క్లబ్లు , ప్రత్యేక ఆసక్తి సమూహాలలో భాగం కావడం ద్వారా పాఠ్యేతర కార్యకలాపాలను మేఘన సమతుల్యం చేసినట్టు తెలిపారు . గీతమ్ నిర్వహించే పలు ఉత్సవాలు , కార్యకలాపాలలో ( కళలు , వ్యాసరచన , వంట , డ్యాన్సు వంటి వాటిలో ) చురుకుగా పాల్గొనడం వంటివి తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినట్టు ఆమె పేర్కొన్నారన్నారు . గీతం నుంచి తనకు లభించిన అద్భుతమైన సహకారం వల్లనే ఇదంతా సాధ్యమైనట్టు మేఘన అభిప్రాయపడినట్టు తెలియజేశారు .
వీటికి అదనంగా , అంతర్జాతీయ సమావేశాలు , పోటీలలో మేఘన పాల్గొనడం , సహ రచయితగా నాలుగు సంకలనాలను ప్రచురించడం వంటివి జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాలపై అవగాహన పెంపొందించు కోవడానికి దోహదపడినట్టు ఆమె తెలిపిందన్నారు . నేషనల్ సెక్యూరిటీ డేటాబేస్ క్రింద సర్టిఫెడ్ సెబర్ క్రైమ్ ఇంటర్వెన్షన్ అధికారిగా తర్ఫీదు పొందడంతో పాటు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొంది , అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మూల్యాకనం చేసిన ప్రొఫెషనల్ ఎథిక్స్ లో కూడా మేఘన శిక్షణ పొందినట్టు తెలియజేశారు .
కోనిడ్ -19 లాక్డ్ డౌన్ సమయంలో చాలా ఆన్లైన్డ్ కోర్సులను చేయడంతో పాటు గీతం ద్వారా కోర్సెరా కోర్సులను కూడా ఆమె అభ్యసించినట్టు వివరించారు . ఈ నేపథ్యం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి , చివరకు భారతదేశంలోనే అత్యంత కష్టతరమైన పరీక్షలలో ఒకదాని ( క్యాట్ ) లో ఆమె విజయానికి మార్గం సుగమం చేసినట్టు పేర్కొన్నారు . తాను ఈ స్థాయికి రావడంలో తోడ్పడిన తల్లిదండ్రులు , అధ్యాపకులు , విభాగాధిపతులు , ప్రిన్సిపాళ్ళు , డెరైక్టర్లతో పాటు గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్కు మేఘన అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…