politics

గీతం విద్యార్థినికి 30 కి పైగా విద్యా సంస్థలలో సీట్లు…

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ , సీఎస్ఈ విద్యార్థిని మేఘన రెడ్డి కొల్లికి 2022-24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు చదవమని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న 30 కి పెగ్జా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ప్రతిపాదనలు పంపాయి . ఐఐఎం ఇండోర్ , కాశీపూర్ , అమృత్సర్ , బుద్ధగయ , సంబలూర్ , సిర్మౌర్ , జమ్మూ ; ఎండీఐ గుర్గావ్ , ఐఐటీ ధన్బాద్ – జోధ్పూర్ ; ఐఎంటీ ఘజియాబాద్ , నాగపూర్ , హెదరాబాద్ ; ఐఎంఐ ఢిల్లీ , కోల్ కతా , భువనేశ్వర్ ; ఎస్పీజేఐఎంఆర్ ముంబై నార్సిమోంజీ ముంబై మాస్టర్స్ యూనియన్ , గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చెన్నయ్ , గుర్గావ్ ; నల్సార్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ – ఢిల్లీ విశ్వవిద్యాలయాలు తమ విద్యా సంస్థలలో చేరమని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు .

విద్యలో మెరుగ్గా ఉండి తొమ్మిది సీజీపీఏ ( 90 శాతానికి పైగా మార్కులు ) సాధించడమే గాక దాదాపు పదికి పెగ్జా గీతమ్ క్లబ్లు , ప్రత్యేక ఆసక్తి సమూహాలలో భాగం కావడం ద్వారా పాఠ్యేతర కార్యకలాపాలను మేఘన సమతుల్యం చేసినట్టు తెలిపారు . గీతమ్ నిర్వహించే పలు ఉత్సవాలు , కార్యకలాపాలలో ( కళలు , వ్యాసరచన , వంట , డ్యాన్సు వంటి వాటిలో ) చురుకుగా పాల్గొనడం వంటివి తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినట్టు ఆమె పేర్కొన్నారన్నారు . గీతం నుంచి తనకు లభించిన అద్భుతమైన సహకారం వల్లనే ఇదంతా సాధ్యమైనట్టు మేఘన అభిప్రాయపడినట్టు తెలియజేశారు .

వీటికి అదనంగా , అంతర్జాతీయ సమావేశాలు , పోటీలలో మేఘన పాల్గొనడం , సహ రచయితగా నాలుగు సంకలనాలను ప్రచురించడం వంటివి జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాలపై అవగాహన పెంపొందించు కోవడానికి దోహదపడినట్టు ఆమె తెలిపిందన్నారు . నేషనల్ సెక్యూరిటీ డేటాబేస్ క్రింద సర్టిఫెడ్ సెబర్ క్రైమ్ ఇంటర్వెన్షన్ అధికారిగా తర్ఫీదు పొందడంతో పాటు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొంది , అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మూల్యాకనం చేసిన ప్రొఫెషనల్ ఎథిక్స్ లో కూడా మేఘన శిక్షణ పొందినట్టు తెలియజేశారు .

కోనిడ్ -19 లాక్డ్ డౌన్ సమయంలో చాలా ఆన్లైన్డ్ కోర్సులను చేయడంతో పాటు గీతం ద్వారా కోర్సెరా కోర్సులను కూడా ఆమె అభ్యసించినట్టు వివరించారు . ఈ నేపథ్యం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి , చివరకు భారతదేశంలోనే అత్యంత కష్టతరమైన పరీక్షలలో ఒకదాని ( క్యాట్ ) లో ఆమె విజయానికి మార్గం సుగమం చేసినట్టు పేర్కొన్నారు . తాను ఈ స్థాయికి రావడంలో తోడ్పడిన తల్లిదండ్రులు , అధ్యాపకులు , విభాగాధిపతులు , ప్రిన్సిపాళ్ళు , డెరైక్టర్లతో పాటు గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్కు మేఘన అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago