మనవార్తలు , పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ఇటీవల హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీలతో అవగాహనా ఒప్పందం ( ఎంవోయూ ) కుదుర్చుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఈ అవగాహనా ఒప్పంద పత్రాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , హెటెరో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ ఎస్.వీ.జయపాల్రెడ్డి సంతకాలు చేసినట్టు తెలియజేశారు . హెటెరో కంపెనీలోని అర్హత కలిగిన ఉద్యోగులకు డాక్టోరల్ డిగ్రీ ( పీహెచీ ) ని చదవడానికి ప్రవేశాలు కల్పించే లక్ష్యంతో ఈ అవగాహనను కుదుర్చుకున్నారు .
పీహెచ్ఐని చదవాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాను తొలుత కంపెనీ పంపుతుందని , అందులో అర్హత గల అభ్యర్థుల జాబితాను విశ్వవిద్యాలయానికి సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు . హెటెరో ఉద్యోగుల నెపుణ్యాలకు పదును పెట్టడానికి గాను యాజమాన్య వికాస కార్యక్రమా ( ఎండీపీ ) లను గీతం నిర్వహిస్తుందన్నారు . ఉభయ పక్షాలు రద్దుచేసుకునే వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపారు . ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , గీతం బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ , కెరీర్ గెడైన్స్ సెల్ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ , ఇతర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…