మనవార్తలు , పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ఇటీవల హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీలతో అవగాహనా ఒప్పందం ( ఎంవోయూ ) కుదుర్చుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఈ అవగాహనా ఒప్పంద పత్రాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , హెటెరో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ ఎస్.వీ.జయపాల్రెడ్డి సంతకాలు చేసినట్టు తెలియజేశారు . హెటెరో కంపెనీలోని అర్హత కలిగిన ఉద్యోగులకు డాక్టోరల్ డిగ్రీ ( పీహెచీ ) ని చదవడానికి ప్రవేశాలు కల్పించే లక్ష్యంతో ఈ అవగాహనను కుదుర్చుకున్నారు .
పీహెచ్ఐని చదవాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాను తొలుత కంపెనీ పంపుతుందని , అందులో అర్హత గల అభ్యర్థుల జాబితాను విశ్వవిద్యాలయానికి సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు . హెటెరో ఉద్యోగుల నెపుణ్యాలకు పదును పెట్టడానికి గాను యాజమాన్య వికాస కార్యక్రమా ( ఎండీపీ ) లను గీతం నిర్వహిస్తుందన్నారు . ఉభయ పక్షాలు రద్దుచేసుకునే వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపారు . ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , గీతం బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ , కెరీర్ గెడైన్స్ సెల్ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ , ఇతర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…