Telangana

క్రీడా స్ఫూర్తిని చాటండి…

గీతమ్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు పటాన్చెరు డీఎస్పీ ఉద్బోధ

– ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ఆటల్లో గెలుపోటములు సహజమని , వాటిని సమంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటి , విజయవంతం చేయాలని పటాన్చెరు డీఎస్పీ ఎస్.భీమ్డ్డి ఉద్బోధించారు . గీతం బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో ‘ లక్ష్య ‘ పేరిట నిర్వహిస్తున్న మూడురోజుల అంతర్ – కళాశాల క్రీడా పోటీలను బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన , క్రీడా జ్యోతిని వెలిగించడం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు . స్వయంగా కబడ్డీ , ఫుట్బాల్ క్రీడాకారుడైన భీమ్ రెడ్డి , ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఎంతో వేగవంతమైన ఈ యుగంలో ప్రతి ఒక్కరూ విద్యకే అధిక ప్రాధాన్యం ఇస్తూ , క్రీడలను విస్మరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు . దేహ ధారుఢ్యానికి , శక్తివంతంగా తయారవడానికి క్రీడలు అత్యావశ్యకమన్నారు . చాలా కళాశాలల్లో క్రీడా మైదానాలే ఉండవని , క్రీడా నిర్వహణ ఖర్చులకు వెనుకాడుతాయని , అటువంటిది గీతమ్ ఇంత పెద్ద మెదానం , ఇంతమంది క్రీడాకారులు ఉండడం ముదావహమని చెప్పారు .

తమను ఇంత మంచి విద్యా సంస్థలో చేర్చిన తల్లిదండ్రులకు విద్యార్థులు రుణపడి ఉండాలని డీఎస్పీ వ్యాఖ్యానించారు . ఈ మూడు రోజులను మేనేజ్మెంట్ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని , తమలోని నెపుణ్యాలు , ప్రతిభను ప్రదర్శించాలని జీఎస్బీ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి సూచించారు . గీతం క్రీడా విభాగం డిప్యూటీ డెరైక్టర్ నారాయణరావు చౌదరి వందన సమర్పణతో ఈ ప్రారంభోత్సవం ముగిసింది . అంతకు మునుపు , క్రీడాకారులందరితో ప్రమాణం చేయించి , క్రీడా జ్యోతి రిలే పరుగును ఎంబీఏ విద్యార్థి కౌశిక్ ఆరంభించారు . వివిధ జట్లలోని కెప్టెన్లు , క్రీడాకారులందరినీ అతిథులకు పరిచయం చేశారు . తొలుత , టోపాజ్ – ఎమరాల్డ్ జట్ల మధ్య క్రికెట్ పోటీని అతిథులు లాంఛనంగా ప్రారంభించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , పటాన్ చెరు సీఐ ఎన్.వేణుగోపాల్రెడ్డి , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . మూడు రోజుల పాటు వివిధ పోటీలతో పాటు సాంస్కృతి కార్యక్రమాలు కొనసాగనున్నాయి .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago