– న్యాయ సేవా దినోత్సవ వేడుకల్లో సంగారెడ్డి న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి జె . హనుమంతరావు
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
మనదేశంలోని చట్టాలు , రాజ్యాంగం , న్యాయ వ్యవస్థపై ప్రతి పౌరుడికీ కనీస అవగాహన ఉండాలని , వాటి గురించి అవగాహన లేదనడం సబబు కాదని సంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి , జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీ జె.హనుమంతరావు స్పష్టీకరించారు . ‘ న్యాయ సేవా దినోత్సవం ‘ సందర్భంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ చట్టపరమైన అవగాహన ద్వారా పౌరుల సాధికారత , వారికి చేరువ కావడం దేశ వ్యాప్త ప్రచారం ‘ అనే అంశంపై బుధవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . బాలలు , మహిళలు , అణగారిన వర్గాలకు ఉన్న హక్కులు , వారి రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పలు చట్టాలు , చట్టపరమైన భద్రతల గురించి జిల్లా న్యాయమూర్తి వివరించారు . ఏదైనా వివాదంలో కోర్టును ఆశ్రయించే వారు , ఒక అవగాహనతో కేసును సత్వరం పరిష్కరించుకోవాలనుకుంటే , పెస్టా ఖర్చు లేకుండా న్యాయ సేవా సాధికార సంస్థ రాజీ కుదురుస్తుందని చెప్పారు . ఉభయ పక్షాల అంగీకారంతో ఒక అవగాహనకు వచ్చేలా చేస్తుందన్నారు .
అవి కుటుంబ వివాదాలు , ఆస్తి తగాదాలు , విడాకుల కేసులు .. ఏవైనా సత్వర పరిష్కారం కోసం ఉభయ పక్షాలు కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న న్యాయ సేవా సాధికార సంస్థను ఆశ్రయించవచ్చని హనుమంతరావు చెప్పారు . రాజ్యాంగ రచన , అందులోని అధికరణలు , హక్కులు , బాధ్యతలతో పాటు కేశవానంద భారతి , రూపాలాల్ బజాజ్ వంటి పలు కేసులతో పాటు రెండు రోజుల క్రితం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ( ఈడబ్ల్యూబీ ) రిజర్వేషన్ల గురించి ఆయన విద్యార్థులకు వివరించారు . అలాగే యాంటీ ర్యాగింగ్ చట్టం , 18 ఏళ్ళ లోపు బాలికలు , మహిళలకు ఉన్న ప్రత్యేక హక్కుల గురించి కూడా చెప్పారు . తొలుత , స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్ . సునీల్ కుమార్ జిల్లా న్యాయమూర్తిని ఆహ్వానించగా , స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ వందన సమర్పణ చేశారు . ఇరువురూ ఆయనను ఉచిత రీతిన దుశ్శాలువతో సత్కరించారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…