Telangana

పూర్తి పారదర్శకతతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తాం

_పూర్తి పారదర్శకతతో దళారుల ప్రమేయం లేకుండా ఇళ్ల కేటాయింపు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకతతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రూపాయి ఖర్చు లేకుండా పైసా అప్పు లేకుండా అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పటాన్చెరువు నియోజకవర్గం వ్యాప్తంగా 30 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత తమపై ఉందన్నారు. విడతలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయం ఇచ్చారు. అక్టోబర్ రెండవ తేదీన లబ్ధిదారులకు ఇల్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago