Hyderabad

రష్యా సింగిల్‌ డోసు స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 79.4 శాతం…

రష్యా సింగిల్‌ డోసు స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 79.4 శాతం!
  • వెల్లడించిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌
  • గమలేయా సెంటర్‌ ఆధ్వర్యంలో పరీక్షలు
  • అన్ని కరోనా రకాలపైనా సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడి
  • 28 రోజుల తర్వాత దాదాపు 80 శాతం సామర్థ్యం

స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ తయారీకి నిధులు సమకూర్చిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) కీలక ప్రకటన చేసింది. తమ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ కరోనా నిరోధంలో 79.4 శాతం సామర్థ్యం చూపినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన 28 రోజుల తర్వాత చేసిన పరిశీలనలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. కొన్ని రెండు డోసుల వ్యాక్సిన్‌ కంటే దీని సామర్థ్యం చాలా మెరుగ్గా ఉందని అభిప్రాయపడింది.

అలాగే ఇది అన్ని రకాల కరోనా వైరస్‌లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని తెలిపింది. గమలేయా సెంటర్‌ నిర్వహించిన లేబోరేటరీ ప్రయోగాల్లో ఈ విషయం రుజువైనట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా టీకాల కొరత ఉన్న సమయంలో సింగిల్‌ డోసు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం కీలకాంశం. ఎక్కువ మందికి వేగంగా వ్యాక్సిన్‌ అందించే అవకాశం ఏర్పడుతుంది. ఫిబ్రవరి 21న స్పుత్నిక్‌ లైట్‌ సామర్థ్య పరీక్షలు ప్రారంభించిన గమలేయా మొత్తం 7000 మందిపై దీన్ని ప్రయోగించింది.

Venu

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago