రోడ్డు నిర్మాణంలో పాలకులు విఫలం…
– కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్చెరు:
గత ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన బీరంగూడ – కిష్టారెడ్డిపేట వెళ్లే రహదారిని నిర్మించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో విఫలం అయ్యారని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
ఆదివారం రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… రోడ్డు నిర్మాణం పనులలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. వంద ఫీట్లతో నిర్మించాల్సిన ఈ యొక్క రోడ్డును స్థానిక ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తితో రోడ్డు వెడల్పు పూర్తిస్థాయిలో తగ్గించారని ఆరోపించారు. రోడ్డు నిర్మాణంలో జాప్యం చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పాలకులకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ యొక్క రహదారిని నాణ్యత ప్రమాణాలు పాటించి, నిర్మించే విధంగా చూడాలన్నారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శశిధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుధాకర్, రవీందర్, కె.శ్రీనివాస్, ప్రకాష్, లింగంగౌడ్,
సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, ఆంజనేయులు, సిద్దు, మహిపాల్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…