పుట్టిన బిడ్డ నుండి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని .పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పటాన్ చెరు మండలానికి చెందిన నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా .పటాన్ చెరు మండలానికి నూతనంగా మంజూరైన 757 రేషన్ కార్డులు, ఒక కోటి 12 లక్షల రూపాయల విలువైన 112 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధికంగా పటాన్ చెరు నియోజకవర్గానికి 2222 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు అయ్యేలా చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నూతన రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ ఆగస్టు 1వ తేదీ నుండి బియ్యం తీసుకోవచ్చని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…