Telangana

జేఈఈ మెయిన్స్‌ 2024లో టాప్‌ స్కోరింగ్‌ సాధించిన రెసొనెన్స్‌ జూనియర్‌ కళాశాలలు విద్యార్ధులు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

ఇటీవల విడుదలైన ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రవేశానికి సంబందించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ తొలివిడత పరీక్ష ఫలితాలలో హైదరాబాద్ లోని రెసొనెన్స్‌ జూనియర్‌ కళాశాల విధ్యార్ధులు అద్బుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఐఐటి, ఎన్‌ఐటి, ఎన్‌ఇఇటి, మెడికల్‌ ప్రవేశ పరీక్షలలో అగ్రశ్రేణి ర్యాంకర్లను తయారు చేయడంలో రెసొనెన్స్‌ జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన ప్రీమియర్‌ ఇన్‌స్టిట్యూట్‌. రెసొనెన్స్‌ జూనియర్‌ కాలేజీలకు చెందిన విద్యార్థులు పరీక్షలో అత్యుత్తమ స్కోర్‌ సాధించారు. టాప్‌ స్కోర్‌ సాధించి అత్యుత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్ధులను వారి తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో మాదాపూర్‌లోని రెసొనెన్స్‌ జూనియర్‌ కళాశాలలో రెసొనెన్స్‌ హైదరాబాద్‌ సెంటర్స్‌ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు సత్కరించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన జేఈఈ పరీక్షలో రెసొనెన్స్‌ అద్భుత ఫలితాలను సాధించిందన్నారు. ఇది రెసొనెన్స్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు ఒక అఖండ విజయం అని అన్నారు. కోట రాజస్థాన్‌ నుండి 2001 సంవత్సరంలో మిస్టర్‌ ఆర్‌.కె.వర్మ ఐఐటి మద్రాస్‌చే స్థాపించబడిన అఖిల భారత సంస్థ రెసొనెన్స్‌. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన నాటి నుండి, రెసొనెన్స్‌ 150 కేంద్రాలతో 87 నగరాల్లో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నదని, రెసొనెన్స్‌ 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణను ఇచ్చింది మరియు ఇప్పటి వరకు 3 లక్షల కు పైగా ఐఐటి, ఎన్‌ఐటి మరియు మెడికల్‌ ర్యాంకర్లను తయారు చేసిందని తెలిపారు.

admin

Recent Posts

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే పాలకవర్గం సభ్యులు,…

10 hours ago

ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు పటాన్‌చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ…

10 hours ago

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

- ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి - సాయిబాబా మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి…

10 hours ago

నైపుణ్యాభివృద్ధిపై గీతం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నైపుణ్యాభివృద్ధి, కెరీర్ అభివృద్ధి, పరిశ్రమకు సంసిద్ధత, ప్రపంచ ఉన్నత విద్యపై అవగాహనను విద్యార్థులలో పెంపొందించడానికి…

10 hours ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ యాజమాన్యం పై చర్యలు ఎందుకు తీసుకోరు..?

చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకోవడం నేరమా..? అక్రమంగా డిస్మిస్ చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి లేనిపక్షంలో కలెక్టరేట్ ముట్టడి సిఐటియు…

10 hours ago

డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి – బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్…

3 days ago