politics

భారతీయ సంస్కృతి ని కాపాడాలి – వెంకయ్య నాయుడు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

కుటుంబ వ్యవస్థ ను కాపాడుతూ భారతీయ సంస్కృతి ని కాపాడాలని మాజీ ఉప రాష్ట్రపతి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహిత ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం రోజు గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో గల అన్వయ కన్వీన్షన్ హల్ లో సుజనా చౌదరి, డాక్టర్ కామినేని శ్రీనివాస్ లు వెంకయ్య నాయుడు ను ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ అభినందన సభలో అయన మాట్లాడుతు నేటి రాజకీయo లో చాలా మార్పులు వచ్చాయని, మంచి నాయకులను ఎన్నుకోవాలని, అప్పుడే మన సమాజం బాగుంటుందని సమాజ బాగుకోసం పాటు పడాలని సూచించారు. నేటి పిల్లలు సృజనాత్మకథను కోల్పోయి, ఆర్టిఫిషియల్ గా తయారవుతున్నారని, చిన్నప్పటి నుండే సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేర్పించాలని, దేశాన్ని, తల్లితండ్రులను ప్రేమించేలా నేర్పించాలన్నారు. ఎలక్రానికి వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. నిరాడంబరుడు, స్నేహ శీలి, అయిన వెంకయ్య నాయుడు లాంటి గొప్ప వ్యక్తులను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు సుజనా చౌదరి, మురళి మోహన్, కెవిపి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago