నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు
పటాన్చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇష్టపడి చదివి.. లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినులకు నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానెల్స్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్య వ్యవస్థ బలోపేతానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు వంగరి అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…
మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…