Telangana

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి

నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే

పాలకవర్గం సభ్యులు, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి

ఇస్నాపూర్ డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం

ఐదు మున్సిపాలిటీలలో చేపడుతున్న అభివృద్ధి పనుల పై సమీక్ష

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో ఇటీవల శంకుస్థాపన చేసిన 75 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లు, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గత నెలలో ప్రతి మున్సిపాలిటీలో చేపట్టిన 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు.ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల పరిధిలో 50 శాతం పనులు ప్రారంభమయ్యాయని మిగిలిన పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. జిన్నారం మున్సిపల్ పరిధిలో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కావడంలేదని చైర్మన్ జనార్ధన్, కమిషనర్ నాగేందర్ తెలిపారు. టెండర్లు పొంది.పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు అందరినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు తిరిగి టెండర్లు రీ కాల్ చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు. గడ్డపోతారం పరిధిలో మొత్తం 15 పనులకు శంకుస్థాపన చేయగా వచ్చే వారంలో అన్ని పనులు ప్రారంభమవుతాయని కమిషనర్ తాన్య తెలిపారు. అభివృద్ధి పనుల అంశంలో నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు.ప్రజలకు జవాబుదారిగా పనిచేసినప్పుడే అధికారులు, ప్రజా ప్రతినిధులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఇస్నాపూర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడతామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. అతి త్వరలో మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు కేటాయించి  బయో మైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి మున్సిపల్ పరిధిలో పది కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సంయుక్తంగా నిధులు అందించనున్నాయని ఇందుకు సంబంధించి ఆయా మున్సిపల్ పాలకవర్గాలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మున్సిపల్ పాలకవర్గం సభ్యులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు సుమలత, ప్రమీల, సుష్మ, కుమార్ గౌడ్, జనార్దన్, వైస్ చైర్మన్లు సంధ్య గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మహేందర్ గౌడ్, కమిషనర్లు వెంకట కిషన్, అజయ్ రెడ్డి, తాన్య, దశరథ్, నరేందర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

admin

Recent Posts

ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు పటాన్‌చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ…

7 hours ago

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

- ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి - సాయిబాబా మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి…

7 hours ago

నైపుణ్యాభివృద్ధిపై గీతం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నైపుణ్యాభివృద్ధి, కెరీర్ అభివృద్ధి, పరిశ్రమకు సంసిద్ధత, ప్రపంచ ఉన్నత విద్యపై అవగాహనను విద్యార్థులలో పెంపొందించడానికి…

7 hours ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ యాజమాన్యం పై చర్యలు ఎందుకు తీసుకోరు..?

చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకోవడం నేరమా..? అక్రమంగా డిస్మిస్ చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి లేనిపక్షంలో కలెక్టరేట్ ముట్టడి సిఐటియు…

7 hours ago

డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి – బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్…

3 days ago

మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు బీజేపీ కుట్ర

సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ ప‌టాన్ చెరు ప‌ట్ట‌ణ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు కొల్కురి న‌ర‌సింహా రెడ్డి మనవార్తలు ప్రతినిధి ,…

3 days ago