Telangana

డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి – బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ తెలిపారు .బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని పీవీ నరసింహ ఆడిటోరియంలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ పార్టీ సూచనల మేరకు డివిజన్ పరిధిలోని ప్రతి బూత్ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్పీడ్ పెంచాలని కోరారు. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బూత్ స్థాయి నుంచి విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌కు ఇద్దరు యువ కార్యకర్తలు, ఒక బూత్ బాధ్యుడిని నియమించి ప్రత్యేక డిజిటల్ సభ్యత్వ నమోదు అనువర్తనం ద్వారా భారీ సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేయాలని సూచించారు. ప్రజలతో మరింత మమేకమై పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజలతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా మలచాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ , నర్రా భిక్షపతి , శ్రీధర్ చారి , వంగారి అశోక్ , చందు , గుండమొల్ల రాజు , కోమరగూడెం వెంకటేష్ , నవీన్ రెడ్డి , శంకర్ , షకీల్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు యంపీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

15 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

16 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

16 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

20 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

20 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

20 hours ago