Telangana

మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు బీజేపీ కుట్ర

సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ ప‌టాన్ చెరు ప‌ట్ట‌ణ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు కొల్కురి న‌ర‌సింహా రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురిచేయ‌డం వెన‌క బీజేపీ కుట్ర‌దాగి ఉంద‌ని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ ప‌టాన్ చెరు ప‌ట్ట‌ణ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు కొల్కురి న‌ర‌సింహా రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరులోని బాబా సాహెబ్ అంబేద్క‌ర్ స‌ర్కిల్ వ‌ద్ద మీనాక్షి నట‌రాజ‌న్ పై అక్ర‌మ కేసు ప్ర‌తుల‌ను కొల్కురి న‌ర‌సింహారెడ్డి త‌గ‌ల‌బెట్టారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుండి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా మీనాక్షి న‌ట‌రాజ‌న్ బ‌రిలో దిగ‌గా …రిట‌ర్నింగ్ అధికారి ఆమె నామినేష‌న్ ను తిర‌స్క‌రించారు .మోడీ ప్రభుత్వం తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేష‌న్ తిర‌స్క‌రించ‌డం సిగ్గుచేటని అన్నారు. గతంలో బిజెపి ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించి ఓటు చోరీ చేసి గద్దెనెక్కిందన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్ర వివరాల ఇన్ ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నిక ప్రక్రియను అక్రమ కేసు పేరు తో అడ్డుకోవడం సిగ్గుచేటని అక్రమ కేసు ప్రతులను తగలబెట్టామని అన్నారు. జూన్ 18న రాజ్యసభ ఎన్నిక ఉన్నందున ఎన్నికల కమిషన్ వెంటనే మీనాక్షి నటరాజన్ ఎన్నికల్లో పోటీలో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్ సాయిలు ముదిరాజ్ ,కార్మిక సంఘం నాయకులు రాజు ,రతన్ సింగ్ ,వినోద్ ,రాము ,ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

15 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

16 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

16 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

20 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

20 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

20 hours ago