Telangana

ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు, క్రీడా కేంద్రాలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే, ఉమ్మడి మెదక్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రీడాకారుల కోసం కోచింగ్ కేంద్రాలు, క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు, ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి క్రికెట్ క్లబ్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే, అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలంపిక్ డే సందర్భంగా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అతి త్వరలో ఒలింపిక్ రన్, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా క్షేత్రస్థాయి నుండి క్రీడా పోటీలు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధి కోసం ఐదు మినీ స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మైత్రి మైదానం వేదికగా ఏడాది పొడవునా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రఘునందన్ రెడ్డి, ఎల్లయ్య, హరికిషన్, బుచ్చిరెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

15 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

16 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

16 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

20 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

20 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

20 hours ago