బీసీ బంద్ ప్రకటించాలని తహసీల్దార్ కి వినతి …
రామచంద్రాపురం :
రాష్ట్రoలో ఉన్న బీసీ కులాల వారందరికీ బీసీ బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం రోజు సంగారెడ్డి జిల్లా… రామచంద్రాపురం ఎమ్మార్వో శివ కుమార్ కు బీసీ సంఘం సంగారెడ్డి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
తోలిగించిన ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ బ్యానర్ తో ప్రదర్శన నిర్వహించారు.బీసీబంద్ ప్రకటించకపోతే కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో. ఆర్.ఐ దీక్షిత్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ ఎన్. కృష్ణ, వాటర్ బాడీ మాజీ చైర్మన్ నర్సింహ, తెల్లాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరణి రాజు, పాండు యాదవ్, సురేష్ చారి, కిట్టు ముదిరాజ్, మున్సిపల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి శివ శంకర్, వనపర్తి ఉప సర్పంచ్ యూ. లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…