మనవార్తలు ,పటాన్ చెరు:
అరకొర సౌకర్యాలతోనే విస్తృత పరిశోధనలను గావించి , అద్భుత ఆవిష్కరణలు చేసి ప్రపంచ మానవాళి పురోభివృద్ధికి దోహదపడ్డ మహనీయులను సదా స్మరించుకోవాలని ముంబెలోని హోమీ భాభా జాతీయ సంస్థ ఉపకులపతి , కల్పక్కంలోని ఐజీసీఏఆర్ పూర్వ సంచాలకుడు ప్రొఫెసర్ పీ.ఆర్ . వాసుదేవరావు సూచించారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఆధ్వర్యంలో ‘ శాస్త్రం – శాస్త్రవేత్తలు ‘ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు . ఆంటోనీ హెన్రీ బెక్వెరెల్ , మేరీ క్యూరీ , లిప్ మీట్నర్ , హోమీ జె . భాభా , సీవీ రామన్ వంటి మహనీయులు తమ తెలివితేటలు , పట్టుదలతో విశేషంగా పరిశోధించి మేటి ఆవిష్కరణలను గావించినట్టు ఆయన చెప్పారు .
అరకొర వసతులతోనే అహోరాత్రులు శ్రమించి ఆయా రంగాలలో రాణించిన వారంతా విభిన్న నేపథ్యల నుంచి వచ్చారన్నారు . వారిలో కొందరికి , తొలినాళ్ళలో తగిన ప్రోత్సాహం కూడా లేదని చెప్పారు . కానీ కృషి , పట్టుదల , నిబద్ధతలతో శ్రమించి విశ్వ మానవాళికి గొప్ప ఆవిష్కరణలను అందించారన్నారు . ఉన్నత విద్యలో మహిళలకు అనుమతి లేక క్యూరీ ఐదేళ్ళు ఖాళీగా ఉండాల్సి వచ్చిందని , చివరకు ట్యూటర్ సహాయంతో వియన్నా విశ్వవిద్యాలయంలో సీటు సాధించి పోస్ట్ డాక్టరల్ వరకు రాణించినట్టు చెప్పారు . రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళాగా పేరొందినా , తొలుత ఆమె పేరు నోబెల్ కమిటీ పరిశీలకనే రాకపోవడం విశేషమన్నారు .
హోమీ భాభాకు విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎన్నో వచ్చినా , వాటిని తృణప్రాయంగా భావించి మనదేశంలో అణుశక్తి రంగానికి బీజం వేసి , ప్రపంచ దేశాల సరసన మనం తలెత్తుకుని నిలబడేలా చేసిన దార్శనికుడిగా ఆయన అభివర్ణించారు . జాతిపిత మహాత్మా గాంధీని ఉటంకిస్తూ ఐదు మహా పాపాలను ప్రొఫెసర్ వాసుదేవరావు ఈ సందర్భంగా గుర్తుచేశారు . పనిలేని సంపద , మనస్సాక్షి లేని ఆనందం , పాత్రలేని జ్ఞానం , నెతికతలేని వాణిజ్యం , మానవత్వం లేని శాస్త్రం , త్యాగంలేని మతం , సూత్రాలు లేని రాజకీయాలు వ్యర్థమన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శరత్చంద్రబాబు అతిథిని పరిచయం చేశారు . భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రావూరి బాలాజీరావు స్వాగతోపన్యాసం చేయగా , స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెస్ జి.శివకుమార్ వందన సమర్పణ చేశారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…