Hyderabad

లైసెన్స్ లేకుండా మందులు నిలువ ఉంచిన కంపెనీకి లక్ష రూపాయల జరిమానా

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

లైసెన్స్ లేకుండా మందులు నిలువ ఉంచిన వ్యాపారికి లక్ష రూపాయల జరిమానా మరియు ఒక రోజు జైలు శిక్ష విధించిన ఘటన కూకట్ పల్లి కోర్టు పరిధిలో జరిగింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ లోని మయూరి నగర్ లో సి.ఎస్.వి. ప్రసాద్ మరియు కాకూరి వివేకా అనే ఇద్దరు వ్యక్తులు ఇంపెక్స్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో సంబంధిత డ్రగ్ లైసెన్స్ లేకుండానే మందులను నిలువ ఉంచి వ్యాపారం చేస్తుండగా 2015 లో అప్పటి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ కేసు నమోదు చేసి న్యాయస్థానం నందు అప్పగించారు.

తరువాత 2017 లో ప్రస్తుత డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కోమల్ల దేవేందర్ రెడ్డి కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 లోని సెక్షన్ 18(c), 27(b)(ii), 27(d) ప్రకారం న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసినారు. నేరం రుజువు కావడంతో కూకట్ పల్లి కోర్టు VIII అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నింధితులకు లక్ష రూపాయల జరిమానా మరియు ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు దేవేందర్ రెడ్డి. తెలిపారు. ఒకవేళ నిందితులు జరిమానా కట్టుని పక్షం లో జైలు శిక్షను మూడు నెలలకు పొడగిస్తూ తీర్పు ఇచ్చారని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago