మనవార్తలు,పటాన్ చెరు:
సమయ పాలన అంటే , రోజులో ఉన్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుని , సరైన ఫలితాలను సాధించడమని , ఇది అన్ని విజయవంత మైన జీవితాలకు పునాది అని గీతం పూర్వ విద్యార్థి , నిర్వహణా రంగ వృత్తి నిపుణుడు , వక్త , 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రామికవేత్తల అవార్డు గ్రహీత సుభాష్ కాకర్ల అన్నారు . గీతం పూర్వ విద్యార్థుల పయనం , వారి అనుభవాలను పంచుకోవడానికి గాను ‘ ట్రెల్ బ్లేజర్స్ ‘ శీర్షికన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్లో గురువారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు . ఈ సందర్భంగా సమయ పాలనపై ఓ విద్యార్థి సంధించిన ప్రశ్నకు బదులిస్తూ , ప్రతి ఒక్కరికీ రోజుకు 24 గంటలే ఉంటాయని , మీరు ఏ విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు , మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎలా పనిచేస్తారు . అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు .
ఇదంతా సాధన ద్వారానే సమకూరుతుందని చెప్పారు . అభిరుచి , వృత్తి నెపుణ్యం , సమయ పాలన , పట్టుదల అనే నాలుగు అంశాలను తాను విశ్వసిస్తానని తెలిపారు . ఓ పనిని ఎంత సమయంలో ముగించాలనే దానిపై స్పష్టత ఉండాలన్నారు . విజయానికి రహస్యం అంటూ ఏదీ లేదని , దానికోసం ఏడడుగులు ఉండవని , అభివృద్ధి వైపు అడుగులేస్తున్న విద్యార్థులంతా నిన్నటి కంటే ఈరోజు కనీసం ఒక శాతమైనా మెరుగ్గా పురోగమించాలని సుభాష్ సూచించారు . ఏదైనా చేయగలననే ధైర్యం ఒక్కసారి వస్తే ఆ వ్యక్తి నాయకుడవుతాడని , కాబట్టి ధైర్యంతో సహజంగా ఏర్పడే అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగితే నాయకుడిగా పరిణమించొచ్చని ఓ ప్రశ్నకు బదులిచ్చారు .
కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న ఆన్లైన్ బోధనలో భౌతిక అనుసంధానం లోపిస్తోందని , దానిని అధిగమించేలా తమని తాము మలచుకోవాలని విద్యార్థులకు సూచించారు . ఓ బిడియస్తుడిగా గీతమ్ 2013 లో బీటెక్ చేరిన తాను , ఉన్నతాధికారులు , విభాగాధిపతులు , సహాధ్యాయులు , చివరకు అటెండ్ల వరకు ఎంతో పెద్ద కుటుంబాన్ని పొందానని , గీతమే తన ఇల్లుగా సుభాష్ అభివర్ణించారు . ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టాలంటే , ముందుగా మనపై మనకు విశ్వాసం ఉండాలని , ఇతరులపై పెద్దగా ఆధారపడకుండా స్వయం కృషితో దానిని విజయవంతం చేయాలని సలహా ఇచ్చారు . తొలుత , గీతం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అతిథిని సత్కరించారు . ఎక్స్టెర్నల్ రిలేషన్స్ డెరైక్టర్ ఆర్కా భట్టాచార్య తన స్వాగతోపన్యాసంలో ఈ ముఖాముఖి లక్ష్యాన్ని వివరించారు . డిప్యూటీ డెరైక్టర్ నవీన్ పినపాత్రుని ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…