Telangana

మన బస్తీ బాట అంటు ప్రజాసమస్యల పై గళమెత్తిన మారబోయిన రవి యాదవ్.

మనవార్తలు ప్రతినిధి శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి అండర్ పాస్ బిడ్జిలో నిలిచిపోయిన మురికి నీటిని తొలగించాలని కోరుతూ బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు యువకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు, తారా నగర్ లోని తుల్జా భవాని ఆలయంలో రవి యాదవ్ మహిళలు పురుషులతో కలిసి పూజలు నిర్వహించారు, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమస్యలు ఉండకుండా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన తుల్జా భవాని అమ్మవారికి మొక్కుకున్నారు,అక్కడినుండి శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పాపి రెడ్డి కాలనీ చందానగర్ అండర్పాస్ రైల్వే బ్రిడ్జి వరకు పాదయాత్ర తో వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ పనితీరు బాగాలేదని చందానగర్ అండర్పాస్ రైల్వే బ్రిడ్జి సమస్య పూర్తి పరిష్కారం కావాలని కోరారు, మున్సిపాలిటీ వాళ్లు పట్టిoచుకోవట్లేరనీ ప్రభుత్వం మరి మా బతుకులకి విలువ లేదా అని ఆవేదన పడుతున్నారనీ, పాపిరెడ్డి ప్రజలు, కెసిఆర్ తెచ్చిన పదేండ్ల పాలనలో చేసిన రోడ్డులో ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి కాంగ్రెస్ చేసిందని చెప్పుకుంటున్నారని తెలిపారు.బి ఆర్ ఎస్ వాళ్లు వచ్చి ఫోటోలు దిగి ఫోతున్నారని, హెడ్డెవచేశారు. మరి ఇపుడు కనులకి కనిపిస్తలేదా అని కార్పొరేటర్ ని ఎమ్మెల్యే గాంధీని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమం లో కే.ఎన్.రాములు, స్వామీనాథ్,వెంకటరెడ్డి, చారీ, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం యాదవ్,గడ్డం శ్రీనివాస్,సురేష్ యాదవ్,గడ్డం మహేష్, గంగాధర్ గౌడ్, కొండకల శ్రీనివాస్, నవీన్ గౌడ్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, స్వామి, రాజు గౌడ్, వడ్డే శ్రీనివాస్, జంగయ్య, బాలరాజు, శంకర్, మున్నా, రాజు గౌడ్ ,శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, రవి, మజీద్, వెంకటేష్, నర్సింహా, రామదేవి, స్వరూప, శశికల, దివ్య, నిరూప, అనిత, రాజేశ్వరి,ఆశ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago