Telangana

సత్య సాయి సేవా సమితి సేవలు అభినందనీయం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మాట ఇచ్చారు ఐదు లక్షలు అందించారు

పటాన్‌చెరు సత్యసాయి సేవా సమితికి అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శ్రీ సత్య సాయిబాబా సేవాసమితి ఆధ్వర్యంలో సమాజ అభివృద్ధికి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని.. నవంబర్లో జరగనున్న సత్య సాయిబాబా గురుపూర్ణిమ ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గము నుండి 3000 మంది భక్తులు తరలి వెళ్తున్నారని ఇందుకోసం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గల సత్య సాయి బాబా మందిరంలో గురు పూర్ణిమ పురస్కరించుకొని వంద రోజులపాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే జీఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అట్టడగు వర్గాల అభివృద్ధికి సత్య సాయి బాబా చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయని తెలిపారు. పటాన్‌చెరులో సత్యసాయి బాబా మందిరం నిర్మాణానికి సైతం గతంలో తాను సంపూర్ణ సహకారం అందించినట్టు గుర్తు చేశారు. సత్య సాయి బాబా సేవ సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోనూ గతంలో ప్రజలకు ప్రత్యేక నీటి ట్యాంకులు నిర్మించి మంచినీటిని అందించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో సత్య సాయిబాబా మందిరాలు నిర్మాణాలకు భూమిని సైతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సత్యసాయి బాబా సేవాసమితి బాధ్యులు రామి రెడ్డి, వెంకటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago