Telangana

నూతన రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ బంధం కొమ్ములో నూతన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరా ప్రారంభం

హాజరైన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి

అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి:

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నూతన రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన జలాలు అందిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము శ్రీకృష్ణ బృందావన్ కాలనీలో 11 కోట్ల 32 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 2 మిలియన్ లీటర్ల జిఎల్ ఎస్ అర్ రిజర్వాయర్ పైపులైన్ వ్యవస్థను బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 300కు పైగా కాలనీలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్యకు ఇబ్బందులు తలెత్తకుండా ఐదు రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. నూతన కాలనీలలో సైతం మంచినీటి పైపులైన్లు వేయడంతో పాటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తావినీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. నీటి కొరతకు ప్రత్యేకగా నిలిచి అమీన్పూర్ మున్సిపాలిటీలో నేడు ప్రతి ఇంటికి మంచినీరు అందించిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పూర్తి సహాయ సహకారాలతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జిఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్రశేఖర్, ఏఈ పూర్ణేశ్వరి, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago