Districts

జిఎస్టీ అధికారుల బెదిరింపుల నుండి కాపాడండి

అనధికారికంగా లక్షలు డిమాండ్ చేస్తున్నారు

ఖమ్మం, అక్టోబర్ 12 :

కరోనా కష్ట కాలంలో కట్టిన ఇండ్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని, జీఎస్టీ కట్టలేదని ఆఫీసుకు పిలిపించి సూపరింటెండెంట్ ప్రసాద్, భరత్ లు బెదిరించారని బిల్డర్ నూకల రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జీఎస్టీ బిల్ రూ. 1.40లక్షల ఫైనే ఉందని అందులో రూ. 80వేలు కడితే మొత్తం చూసుకుంటామన్నారని పేర్కొన్నారు. డబ్బులు లేక బ్రతిమిలాడుకొని రూ. 40వేలు సాధించి ఆఫీసుకు వెళ్లి ఇచ్చానని పేర్కొన్నారు. రెండు నెలల తర్వాత కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్నారని జీఎస్టీ బిల్లులు కట్టనవసరంలేదని రూ.12వేలతో ఆన్ లైన్లో రెన్యూవల్ చేయించుకోవచ్చునంటే ఆడిట్ ప్రకారం రెన్యువల్ చేయించుకున్నానని తెలిపారు.

కట్టిన బిల్డింగ్ లకు ఆడిట్ ప్రకారం ఆన్ లైన్లో జీఎస్టీ ఫీజ్ కట్టానని తెలిపారు. మరలా అదే జీఎస్టీ అధికారులు ఆఫీసుకు పిలిపించుకుని నీ ట్రాంజక్షన్ బాగుందని రూ.10లక్షలు కట్టాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్నాను అంత డబ్బులు కట్టలేనని పేర్కొన్నప్పటికీ వారి బలవంతపు ఒప్పందం ప్రకారం రూ. 6.50లక్షలు 15రోజుల్లో ఇవ్వాలన్నారని తెలిపాడు.

మరలా 3రోజులకే ఫోన్ చేసి నీకే బర్డెన్ తగ్గుతుంది రూ. 3.50లక్షలు ఒకరోజు, మిగతా రూ. 3లక్షలు మరో రోజు ఇవ్వచ్చని వత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై హైదరాబాద్ జీఎస్టీ కమీషనర్ సురేష్ కి ఫిర్యాదు చేశానని తెలిపారు. విచారణ చేసి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న జీఎస్టీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago