Districts

జిఎస్టీ అధికారుల బెదిరింపుల నుండి కాపాడండి

అనధికారికంగా లక్షలు డిమాండ్ చేస్తున్నారు

ఖమ్మం, అక్టోబర్ 12 :

కరోనా కష్ట కాలంలో కట్టిన ఇండ్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని, జీఎస్టీ కట్టలేదని ఆఫీసుకు పిలిపించి సూపరింటెండెంట్ ప్రసాద్, భరత్ లు బెదిరించారని బిల్డర్ నూకల రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జీఎస్టీ బిల్ రూ. 1.40లక్షల ఫైనే ఉందని అందులో రూ. 80వేలు కడితే మొత్తం చూసుకుంటామన్నారని పేర్కొన్నారు. డబ్బులు లేక బ్రతిమిలాడుకొని రూ. 40వేలు సాధించి ఆఫీసుకు వెళ్లి ఇచ్చానని పేర్కొన్నారు. రెండు నెలల తర్వాత కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్నారని జీఎస్టీ బిల్లులు కట్టనవసరంలేదని రూ.12వేలతో ఆన్ లైన్లో రెన్యూవల్ చేయించుకోవచ్చునంటే ఆడిట్ ప్రకారం రెన్యువల్ చేయించుకున్నానని తెలిపారు.

కట్టిన బిల్డింగ్ లకు ఆడిట్ ప్రకారం ఆన్ లైన్లో జీఎస్టీ ఫీజ్ కట్టానని తెలిపారు. మరలా అదే జీఎస్టీ అధికారులు ఆఫీసుకు పిలిపించుకుని నీ ట్రాంజక్షన్ బాగుందని రూ.10లక్షలు కట్టాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్నాను అంత డబ్బులు కట్టలేనని పేర్కొన్నప్పటికీ వారి బలవంతపు ఒప్పందం ప్రకారం రూ. 6.50లక్షలు 15రోజుల్లో ఇవ్వాలన్నారని తెలిపాడు.

మరలా 3రోజులకే ఫోన్ చేసి నీకే బర్డెన్ తగ్గుతుంది రూ. 3.50లక్షలు ఒకరోజు, మిగతా రూ. 3లక్షలు మరో రోజు ఇవ్వచ్చని వత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై హైదరాబాద్ జీఎస్టీ కమీషనర్ సురేష్ కి ఫిర్యాదు చేశానని తెలిపారు. విచారణ చేసి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న జీఎస్టీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

10 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago