Districts

ఎస్ డీ వరప్రసాద్ కు డాక్టరేట్

పటాన్‌చెరు:

సాధారణ అంతర్జాల శోధన పద్ధతులను ఉపయోగించిన నిర్ధారిత సమాచారాన్ని పొందడానికి ఆధునిక విధానాలను రూపొందించి, సిద్ధాంత వ్యాసం సమర్పించిన పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సెర్చ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ డీ వరప్రసాద్ కు డాక్టరేట్ వరించింది. ఈ విషయాన్ని మంగళవారం విడుదల పేర్కొన్నారు. ఉషా రమ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కె .రాజశేఖరరావు మార్గదర్శనంలో పరిశోధనలు చేసి గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాకు ఆయన అర్హత సాధించినట్టు తెలిపారు.

యూనిఫామ్ రిసోర్స్ లింక్ (యూఆర్ఎల్ లేదా ఏకరీతి వనరుల లింక్) ద్వారా అనుసంధానం అవుతుందో లేదో తనిఖీ చేయడానికి మిశ్రమ (హెబ్రీడ్) విధానాన్ని ఉపయోగించి అంతర్జాల సమాచారాన్ని భద్రంగా సేకరించడానికి ఈ పరిశోధనలో ప్రాధాన్యం ఇచ్చినట్టు వివరించారు. మనం ఒక పనికోసం వినియోగిస్తున్న యూఆర్ఎల్ హానికరమైనదా, కాదా అని కనుగొనడంలో ఉత్తమ ఫలితాలను కనబరచిందని, ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, బిల్లు చెల్లింపుల వంటి ఆర్థిక లావాదేవీలకు ఈ ఆధునిక విధానం ఉత్తమమైనదని పేర్కొన్నారు.

ఈ సిద్ధాంత వ్యాసంలో పేర్కొన్న మిశ్రమ విధానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేసిన అప్లికేషన్ సెబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వంటి పలు రంగాలలో ఉపయోగించవచ్చని తెలియజేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన వరప్రసాద్ ను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఏకే మిట్టల్, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago