పటాన్ చెరు
ఆపదలో ఉన్నవారికి ఆదుకొంటు అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేస్తూ సేవే లక్ష్యంగా ముందుగు సాగుతున్న పటాన్ చెరు మాజీ సర్పంచ్ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు.దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే దేవేందర్ రాజు మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని పటేల్ గూడా గ్రామ పంచాయతీలో గల బి హెచ్ ఈ ఎల్ కార్మికుల కాలనీ కు సంబంధించిన మెట్రో ఎన్ క్లేవ్ మరియు ఇతర కాలనీల దారిలో
శ్రీ శ్రీ శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం నిర్మాణానికి పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ భక్తుని అలవాటు చేసుకోవాలి సూచించారు.
తద్వారా మనశ్శాంతిని పొందుతారని, రోజువారి నిర్వహించే పనుల్లో విజయవంతంగా ముందుకు పోయే అవకాశం ఉంటుందన్నారు. దేవుడి ఆశీస్సులతో మానసిక ప్రశాంతతతో ప్రతి ఒక్కరూ సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు. హనుమాన్ ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్ గూడా సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్, ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు దామోదర్ రెడ్డి, మెట్రో ఎన్ క్లేవ్, సూర్యోదయ కాలనీ వాసులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…