Districts

జిఎస్టీ అధికారుల బెదిరింపుల నుండి కాపాడండి

అనధికారికంగా లక్షలు డిమాండ్ చేస్తున్నారు

ఖమ్మం, అక్టోబర్ 12 :

కరోనా కష్ట కాలంలో కట్టిన ఇండ్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని, జీఎస్టీ కట్టలేదని ఆఫీసుకు పిలిపించి సూపరింటెండెంట్ ప్రసాద్, భరత్ లు బెదిరించారని బిల్డర్ నూకల రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జీఎస్టీ బిల్ రూ. 1.40లక్షల ఫైనే ఉందని అందులో రూ. 80వేలు కడితే మొత్తం చూసుకుంటామన్నారని పేర్కొన్నారు. డబ్బులు లేక బ్రతిమిలాడుకొని రూ. 40వేలు సాధించి ఆఫీసుకు వెళ్లి ఇచ్చానని పేర్కొన్నారు. రెండు నెలల తర్వాత కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్నారని జీఎస్టీ బిల్లులు కట్టనవసరంలేదని రూ.12వేలతో ఆన్ లైన్లో రెన్యూవల్ చేయించుకోవచ్చునంటే ఆడిట్ ప్రకారం రెన్యువల్ చేయించుకున్నానని తెలిపారు.

కట్టిన బిల్డింగ్ లకు ఆడిట్ ప్రకారం ఆన్ లైన్లో జీఎస్టీ ఫీజ్ కట్టానని తెలిపారు. మరలా అదే జీఎస్టీ అధికారులు ఆఫీసుకు పిలిపించుకుని నీ ట్రాంజక్షన్ బాగుందని రూ.10లక్షలు కట్టాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్నాను అంత డబ్బులు కట్టలేనని పేర్కొన్నప్పటికీ వారి బలవంతపు ఒప్పందం ప్రకారం రూ. 6.50లక్షలు 15రోజుల్లో ఇవ్వాలన్నారని తెలిపాడు.

మరలా 3రోజులకే ఫోన్ చేసి నీకే బర్డెన్ తగ్గుతుంది రూ. 3.50లక్షలు ఒకరోజు, మిగతా రూ. 3లక్షలు మరో రోజు ఇవ్వచ్చని వత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై హైదరాబాద్ జీఎస్టీ కమీషనర్ సురేష్ కి ఫిర్యాదు చేశానని తెలిపారు. విచారణ చేసి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న జీఎస్టీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago