Districts

ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోడీ_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పటాన్చెరులో భారీ నిరసన కార్యక్రమం

_మద్దతు పలికిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

మన వార్తలు ,పటాన్ చెరు:

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజులు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పని చేస్తోందని అన్నారు.

నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు విక్రయిస్తూ కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కార్మికుల పాలిట శాపంగా మారిన లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, జిల్లా అధ్యక్షుడు శివ శంకర్, నర్రా బిక్షపతి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, కార్మిక విభాగం నాయకులు భాస్కర్ రెడ్డి, మాధవరావు, వెంకట్రావు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

3 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

6 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago