Districts

వేగవంతంగా రామప్ప సుందరీకరణ : పురావస్తు శాస్త్రవేత్త

మన వార్తలు ,పటాన్ చెరు:

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన రామప్ప దేవాలయం సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని , దానితో పాటు చార్మినార్కు కూడా కొత్త సొబగులద్దుతున్నట్టు పురావస్తు శాఖ హెదరాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ స్మిత ఎస్.కుమార్ తెలియజేశారు . గీతం స్కూల్ ఆఫ్ సోషల్ సెన్సైస్ , హ్యుమానిటీస్ ( జీఎస్చ్ఎస్ ) ఆధ్వర్యంలో ‘ భారత పురావస్తు శాఖ నిర్వహించిన త్రవ్వకాల ప్రాముఖ్యత ‘ అనే అంశం సోమవారం నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా హైదరాబాద్ సర్కిల్ పరిధిలో ఆ శాఖ సాధించిన అభివృద్ధి , వస్తున్న సానుకూల ఫలితాలను ఆమె వివరించారు . బహుళ విభాగాలతో కూడిన పురవస్తు శాఖకు ఇంజనీరింగ్ , కెమిస్ట్రీ , హిస్టరీ వంటి పలు రంగాలకు చెందిన యువ ఔత్సాహికుల అవసరం ఉందని చెప్పారు . ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలతో పాటు పురావస్తు శాస్త్రవేత్తలుగా మారడానికి భారతదేశంలో అందుబాటులో ఉన్న వివిధ విద్యావకాశాలను ఆమె వివరించారు .

నీటి అడుగున సదుపాయం , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ( జీఐఎస్ ) , జియోగ్రాఫిక్ పెనెట్రేటింగ్ రాడార్ ( జీపీఆర్ ) , ఏరియల్ ఫోటోగ్రఫీ వంటి సరికొత్త సాంకేతికతలు విద్యార్థులలో ఉత్సుకతను రేకెత్తించాయి . మనదేశంలో 52 ఆర్కియాలజీ మ్యూజియాలు , ఆరు త్రవ్వకాల కేంద్రాలున్నట్టు ఆమె చెప్పారు . మొదటి రాతి యుగం నుంచి నియోలిథిక్ కాలం చివరి దశ వరకు పాలియోలిథిక్ రాతి ఆయుధాలను డాక్టర్ స్మిత , ఆమె బృందం ప్రదర్శించారు . ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపడుతున్న కార్యకలాపాలు , యాత్రలు , వాటి ప్రక్రియలను వివరించారు . జీఎస్చ్ఎస్ అధ్యాపకులు డాక్టర్ వి.వి. అభిలాష్ , డాక్టర్ పూజా రెస్ట్రాలు ఈ కార్యశాలను సమన్వయం చేశారు . హ్యుమానిటీస్లోని వివిధ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులు , అధ్యాపకులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago