గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా పటాన్చెరు యువ నాయకుల ప్రచారం

Districts Telangana

గెటిఆర్ఎస్ యువనాయకులు గూడెం విక్రమ్ రెడ్డి ధీమా

పటాన్చెరు

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి మద్దతుగా పటాన్చెరు టిఆర్ఎస్ యువనాయకుల బృందం ప్రచారం నిర్వహించింది. గురువారం హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ భారీ విజయానికి గెలుపు బాటలు గా మారుతున్నాయని అన్నారు.

ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. హుజురాబాద్ అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను ప్రజలు గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు మెరాజ్ ఖాన్, విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ కృష్ణకాంత్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు చెన్నారెడ్డి, నాయకుడు తరుణ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, సోహైల్ ఖాన్, రవికుమార్, సంపత్, జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *