ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
ఈనెల 30న కళాశాలల బహిష్కరణ
బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడొద్దని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ అన్నారు. శుక్రవారం బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు యాజమాన్యాలు సర్టిఫికెట్ లు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిజు బకాయలు చెల్లిస్తామని చెప్పిన సీఎం రేవంత్ గద్దెనెక్కిన తరువాత 10వేల కోట్లు ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకు మనోవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జీవో నెం 8,9 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈనెల 30న కళశాలల తరగతుల బహిష్కరణ చేయడం జరుగుతుందని, కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.
