అమీన్పూర్ లో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గ పరిధిలోని ముదిరాజుల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య రోడ్డులో నూతనంగా నిర్మించ తలపెట్టిన ముదిరాజ్ భవనం పనులకు ఆయన ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సేవా దృక్పథం ధైర్యానికి మారుపేరైన ముదిరాజులు తెలంగాణ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ముదిరాజుల కోసం సొంత నిధులచే సంక్షేమ సంఘ భవనాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పటాన్చెరులోని ముదిరాజ్ భవన్ ను రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో ఆధునీకరించడం జరిగిందని గుర్తు చేశారు. అమీన్పూర్ లో నిర్మిస్తున్న ముదిరాజ్ భవన్ నిర్మాణానికి సైతం త్వరలోనే నిధులు అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ. ముదిరాజులకు తగు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గము నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ముదిరాజులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్లు చంద్రకళ గోపాల్, కొల్లూరి మల్లేష్, బాలరాజు, ఉపేందర్, కృష్ణ, బిజీలీ రాజు, చదువుల మల్లేష్, రాములు, బాశెట్టి అశోక్, రాజేష్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…