అమీన్పూర్ లో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గ పరిధిలోని ముదిరాజుల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య రోడ్డులో నూతనంగా నిర్మించ తలపెట్టిన ముదిరాజ్ భవనం పనులకు ఆయన ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సేవా దృక్పథం ధైర్యానికి మారుపేరైన ముదిరాజులు తెలంగాణ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ముదిరాజుల కోసం సొంత నిధులచే సంక్షేమ సంఘ భవనాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పటాన్చెరులోని ముదిరాజ్ భవన్ ను రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో ఆధునీకరించడం జరిగిందని గుర్తు చేశారు. అమీన్పూర్ లో నిర్మిస్తున్న ముదిరాజ్ భవన్ నిర్మాణానికి సైతం త్వరలోనే నిధులు అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ. ముదిరాజులకు తగు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గము నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ముదిరాజులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్లు చంద్రకళ గోపాల్, కొల్లూరి మల్లేష్, బాలరాజు, ఉపేందర్, కృష్ణ, బిజీలీ రాజు, చదువుల మల్లేష్, రాములు, బాశెట్టి అశోక్, రాజేష్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…