పుట్టిన బిడ్డ నుండి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని .పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పటాన్ చెరు మండలానికి చెందిన నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా .పటాన్ చెరు మండలానికి నూతనంగా మంజూరైన 757 రేషన్ కార్డులు, ఒక కోటి 12 లక్షల రూపాయల విలువైన 112 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధికంగా పటాన్ చెరు నియోజకవర్గానికి 2222 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు అయ్యేలా చేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నూతన రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ ఆగస్టు 1వ తేదీ నుండి బియ్యం తీసుకోవచ్చని తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…