_బండలగూడలో కోటి 30 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి భవనాల ప్రారంభం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సామాజిక సేవలో పారగాన్ పరిశ్రమ సహకారం ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరువు డివిజన్ పరిధిలోని బండలగూడ మార్క్స్ కాలనీలో పారగాన్ పరిశ్రమ ఆర్థిక సహకారంతో ఒక కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యంత నిరుపేదలు నివసించే మార్క్స్ కాలనీలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఆధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించడం పట్ల పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్ళలో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహకారంతో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. పాఠశాలలో గ్రంథాలయం పుస్తకాల కోసం సొంత నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బండలగూడ అధ్యక్షులు గోపాల్, పరిశ్రమ డైరెక్టర్ సిద్ధార్థ్, ప్రతినిధులు బిను, శ్రీజిత్, మల్లేష్ యాదవ్, చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…