Telangana

ప్రకృతి నుంచి ప్రేరణ పొందండి

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సూచించిన విశిష్ట భౌతిక శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ బీవీఆర్ టాటా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఏ పరిశోధనకైనా ప్రకృతే మూలమని, దాని నుంచి ప్రేరణ పొంది, వాటికి ప్రయోగశాలలో ఆచరణాత్మకంగారుజువు చేయాలని భౌతిక శాస్త్ర విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ బీవీఆర్ టాటా సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఫొటోనిక్ స్పటికాల నమూనాల ఘర్షణ: భౌతికశాస్త్రం, సెన్సింగ్ అప్లికేషన్స్’ అనే అంశంపై మంగళవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు. కొల్లాయిడల్ క్రిస్టల్ టెంప్లేట్లు మూడు కోణాలలో నానోమీటర్ నుంచి సబ్ మైక్రో మీటర్ లక్షణాలతో ఆవర్తనాలను నిర్మించడానికి బహుముఖ సింథటిక్ సాంకేతికగా మారుతుందన్నారు. ఈ సాంకేతికత విభిన్న పరిమాణాలు, స్వరూపాలు, కూర్పులతో పోరస్ పదార్థాల సంశ్లేషణను అనుమతించడమే గాక, వివిధ సెన్సింగ్ అప్లికేషన్లకు దారితీస్తుందని చెప్పారు. ఎలక్ట్రాన్ ల కంటే ప్రోటాన్ లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ప్రోటాన్ లు పరమాణువులతో ఢీకొనే అవకాశం ఉందని, తత్ఫలితంగా ఎక్స్- కిరణాలు విడుదలవుతాయన్నారు. ఇది భవిష్యత్తులో మరింత ప్రత్యేకమైన పదార్థాలు, అప్లికేషన్ల అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. అధ్యాపకులు, విద్యార్థుల ప్రశ్నలకు జవాబులివ్వడంతో ఈ కార్యక్రమం ముగిసింది.భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి. విశ్వం అతిథికి జ్ఞాపికను అందజేసి. కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఉపన్యాసం భౌతికశాస్త్రంలో అత్యాధునిక పరిజ్ఞానం, దాని అనువర్తనాలపై లోతైన అవగాహనను ఏర్పరచింది.

 

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago