Telangana

టెక్నీకల్ వర్కర్లకు మంచి డిమాండ్ ఉంది

– నీడ్స్ రిసోసెర్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ప్లంబింగ్ డే సెలబ్రేషన్స్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

ప్రపంచ వ్యాప్తంగా టెక్నీకల్ వర్కర్లకు మంచి డిమాండ్ ఉందని మాజీ క్రెడాయి అధ్యక్షులు, ఐ జి బి సి హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శేఖర్ రెడ్డి అన్నారు. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, టి ఎన్ జి ఓ కాలనిలో ఏర్పాటు చేసిన వరల్డ్ ప్రంబింగ్ డే సెలబ్రేషన్స్ కు ఆయన ముఖ్యాతిగా హాజరై మాట్లాడుతు జర్మనీ లాంటి దేశాల్లో కూడా ప్లంబర్లకు లైసెన్స్ లున్నాయని, లైసెన్స్ లేని ఏ టెక్నీషియన్ ను కూడా ఏ పని చేయనీయరని, ఇంజనీర్ ల కంటే కూడా వీరికే డిమాండ్ ఉందన్నారు. టెక్నీకల్ వర్కర్ల కొరత చాలా ఉందని, టెక్నీకల్ వర్కర్లకు సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ తో పాటు, మరో పదిమంది కి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. ఇంజనీరింగ్ చదివిన వారు కేవలం 15 శాతం మంది మాత్రమే ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నారని, మిగతా వారు వేరే వేరే రంగాల్లో పని చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా టెక్నీకల్ వర్కర్ల కోసం ప్రత్యేక చొరవ తీసుకొని ట్రేనింగ్ ఇవ్వడానికి ఇతర సంస్థలతో అనుసంధానం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్లంబింగ్ వారి అవసరం చాలా ఉందని, హైదరాబాద్ లాంటి నగరంలో గేటెడ్ కమ్యూనిటీ లు పెరిగాయని, వాటిలో వీరి అవసరం ఎంతైనా ఉందన్నారు. వీరి కోసం వేడుక చేసుకోవడం అభినందించదగ్గ విషయమని తెలిపారు.

రాంఖి ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ ఎం. డి. నందకిశోర్ మాట్లాడుతు ప్లంబర్స్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. వీరి పాత్ర అమూల్య మైందని పేర్కొన్నారు. నీడ్స్ రిసో సెర్స్ ఎం. డి పి. ఎస్. రెడ్డి మాట్లాడుతు ప్లంబింగ్ వ్యవస్థ అనేది 5 వేల సంవత్సరాలనుండే ఉందని, అనేకమంది పురావస్తు శాస్త్ర వేత్తలు కనిపెట్టారని, పిరమిడ్ లలో కూడా కాపర్ పైపుల తో చేసిన ప్లంబింగ్ గుర్తులున్నాయని, కాలక్రమేణా అనేక మార్పులు చెందుతు వస్తుందని తెలిపారు. ప్లంబింగ్ వర్క్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి పొందవచ్చని తెలిపారు. ఎక్కువ మంది సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ అంటూ అటు వైపు వెళ్తున్నారని, కానీ వీరికున్న డిమాండ్ మరెవరికి లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లంబింగ్ డే చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మొత్తం 19 సైట్లలో 150 ప్లంబర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్బంగా పనిలో మంచి ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమం లో ప్లంబింగ్ వర్కర్స్ కో ఆర్డినేటర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago