మనవార్తలు ,పటాన్ చెరు:
మెట్రోరైలు సంగారెడ్డి వరకు సాధించేంత వరకు మెట్రోరైల్ సాధన సమితి పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు .పటాన్ చెరు గాయిత్రి ఫంక్షన్ హాల్ లో మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో సోషల్ మీడియా డిజిటల్ ఈవెంట్ నిర్వహించారు . మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటామన్నారు . పటాన్ చెరు, సంగారెడ్డి ,లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిత నిక్షిప్తమై ఉందని మెట్రోరైల్ సాధన లో యువకులు కీలక పాత్ర పోషించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో దాదాపు 500 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు మెట్రోరైల్ సాధించే వరకు విశ్రమించేది లేదని అతి త్వరలో ప్రజల వద్దకు మెట్రోరైల్ ఉద్యమాన్ని తీసుకువెళ్ళి వారికి అవగాహన కల్పిస్తామన్నారు. మెట్రోరైలు సాధన కోసం కార్యాచరణ రూపొందించినట్లు మాజీ ఎమ్యెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్ రాజన్ సింగ్, ఈర్ల రాజు, బాసిత్ ,మెట్టుశ్రీధర్, రాజెందర్ రెడ్డి, బిక్షపతి, మన్నె రాములు,కలివేముల రాజు, రమేష్, రవి ,బలరాం తదితరులు పాల్గొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…