మనవార్తలు ,పటాన్ చెరు:
మెట్రోరైలు సంగారెడ్డి వరకు సాధించేంత వరకు మెట్రోరైల్ సాధన సమితి పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు .పటాన్ చెరు గాయిత్రి ఫంక్షన్ హాల్ లో మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో సోషల్ మీడియా డిజిటల్ ఈవెంట్ నిర్వహించారు . మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటామన్నారు . పటాన్ చెరు, సంగారెడ్డి ,లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిత నిక్షిప్తమై ఉందని మెట్రోరైల్ సాధన లో యువకులు కీలక పాత్ర పోషించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో దాదాపు 500 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు మెట్రోరైల్ సాధించే వరకు విశ్రమించేది లేదని అతి త్వరలో ప్రజల వద్దకు మెట్రోరైల్ ఉద్యమాన్ని తీసుకువెళ్ళి వారికి అవగాహన కల్పిస్తామన్నారు. మెట్రోరైలు సాధన కోసం కార్యాచరణ రూపొందించినట్లు మాజీ ఎమ్యెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్ రాజన్ సింగ్, ఈర్ల రాజు, బాసిత్ ,మెట్టుశ్రీధర్, రాజెందర్ రెడ్డి, బిక్షపతి, మన్నె రాములు,కలివేముల రాజు, రమేష్, రవి ,బలరాం తదితరులు పాల్గొన్నారు .
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…